Phone Power Shock: ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్.. మరో ఇద్దరికీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Girls Get Electric Shock While Talking On Phone In Chennai: తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్కి చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ యువతికి కరెంట్ షాక్ కొట్టింది. ఆమెను కాపాడబోయిన మరో ఇద్దరికీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని ఓ హాస్టల్లో ఉంటోన్న యువతి, తన పవర్ బ్యాంక్కి చార్జింగ్ పెట్టి ఫోన్లో మాట్లాడుతోంది. అయితే.. ఆ హాస్టల్ కిటికీ సమీపంలోనే విద్యుత్ పోల్ ఉంది. ఆ యువతి కూడా కిటికీ దగ్గరే నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో విద్యుత్ పోల్ నుంచి ఆ పవర్ బ్యాంక్కి కరెంట్ సప్లై అయ్యింది. ఆ పవర్ బ్యాంక్కి ఫోన్ ఎటాచ్ చేసి ఉండటంతో.. కరెంట్ షాక్ కొట్టి ఆ యువతి అల్లాడిపోయింది. అదే రూమ్లో ఉన్న మరో ఇద్దరు యువతులు అది గమనించి.. ఆమెను కాపాడబోయారు. కానీ.. వారికి కూడా షాక్ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్న వైద్యులు.. వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Fasting Benefits: ఉపవాసంతో అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఇలా చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా.. ఫోన్ పేలి ఎందరో గాయపడిన సంఘటనలు ఇదివరకు చాలానే చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు ఓవర్హీట్ కారణంగా సెల్ఫోన్లు పేలిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల చాలామంది తీవ్ర గాయాలపాలైతే.. మరికొందరు ప్రాణాలే కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చార్జింట్ పెట్టి ఫోన్లో మాట్లాడొద్దని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కొందరు వారి మాటల్ని బేఖాతరు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ పవర్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల పవర్ బ్యాంక్కి కరెంట్ సప్లై అయి, దానికి ఎటాచ్ చేసిన ఫోన్ ద్వారా షాక్ కొట్టింది. అవగాహన లోపంతో ఆ యువతి చేసిన చిన్న తప్పు.. ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. కుటుంబసభ్యులు తమ పిల్లలు ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
Road Accident: పల్టీలు కొట్టిన వాహనం.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!