Chennai: ముంబై బాలికపై ఆటోడ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు అత్యాచారం.. నిందితుల్లో ఏపీ వాసి
- చెన్నై.. పుదుచ్చేరిలో దారుణం
- ముంబై బాలికపై ఆటోడ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు అత్యాచారం
- నిందితుల్లో ఏపీ వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు దీపావళి పండుగకు పుదుచ్చేరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ బాలిక.. తల్లితో గొడవపడి అక్టోబర్ 30న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పర్యాటక ప్రాంతాలు చూపించాలంటూ ఓ ఆటో డ్రైవర్ను కోరింది. డ్రైవర్.. నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను పుదుచ్చేరిలోని బీచ్ రోడ్లో వదిలేసి వెళ్లాడు. అక్కడ బలహీన స్థితిలో కనిపించిన బాలికను చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలు గమనించారు. చెన్నైలో స్నేహితుడి ఇంటికి వెళ్లాలని ఆమె అడగగానే.. తాము తీసుకెళ్తామంటూ నమ్మించి చెన్నైకి తీసుకొచ్చారు. అనంతరం ఓ గదికి తీసుకెళ్లి బాలికపై ఒకరి తర్వాత మరొకరు.. వరుసగా ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి ఆమెను క్యాబ్ బుక్ చేసి పుదుచ్చేరికి పంపేశారు.
Also Read
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
అయితే తమ కుమార్తె తప్పిపోయిందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులుకు.. బీచ్లో బాలిక తారసపడ్డాది. బలహీన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాలిక వ్యక్తిత్వ లోపానికి గురైనట్లుగా గుర్తించారు. బాలిక ద్వారా వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. తనపై గ్యాంగ్రేప్ జరిగినట్లుగా తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విల్లుపురం జిల్లా కోటకుప్పానికి చెందిన డ్రైవర్ కాజా మొహిదీన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిని, ఒడిశాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారందరినీ పట్టుకునే వరకు అరెస్టయిన వారి పేర్లను బయటపెట్టకూడదని పోలీసులు నిర్ణయించారు.
ఆటో డ్రైవర్ మొహిదీన్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లే ముందు గెస్ట్హౌస్లో ఆమెపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. మొహిదీన్, ఇతరులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012లోని సెక్షన్ 6 మరియు BNS సెక్షన్ 137 కింద కేసు నమోదు చేశారు. మొహిదీన్ జైలులో ఉండగా.. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!