దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.