PMSBY: సూపర్ స్కీమ్.. ఏడాదికి రూ. 20 కడితే చాలు రూ.2 లక్షలు ఇస్తున్న కేంద్రం!
- కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్
- పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన
- ఏడాదికి రూ. 20 కడితే చాలు రూ.2 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజనను తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ లో మీరు కేవలం 20 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల బీమాని పొందవచ్చు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ యాన్యువల్ ప్రీమియం కేవలం రూ.20 మాత్రమే. అంటే ఇందులో మీరు సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు. అయితే ఈ పాలసీని ప్రతి సంవత్సరం కూడా రెన్యూవల్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బీమా డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన పాలసీదారు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యంతో మరణించినా వారి కుటుంబానికి రూ.2 లక్షల డబ్బుని చెల్లిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదంలో పాలసీదారు రెండు కళ్లు పోగొట్టుకున్నా కూడా వారి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
Also Read
- PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
- IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
- Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
- SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
రెండు చేతులు, రెండు కాళ్లు వైకల్యం కలిగి ఉన్నా కూడా బీమా కట్టిన వారి కుటుంబానికి పరిహారంగా రూ.2 లక్షల డబ్బుని ఇస్తారు. అలాగే బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో ఒక కాలు, చేయి లేదా ఒక కన్ను పోగొట్టుకుంటే రూ.1 లక్ష ఇస్తారు. ఇక ఈ ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన స్కీమ్ కి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్సైట్ https://www.jansuraksha.gov.in/ని ఓపెన్ చేయాలి.
ఇక ఆ తర్వాత మీరు ఫారమ్లపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫారమ్పై క్లిక్ చేసి, తరువాత మీ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫారమ్లో అడిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇంకా దీనితో పాటు మీరు అందులో అడిగిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఫారమ్ను సబ్మిట్ చేయాలి. ఈ స్కీమ్ కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!