Text Message: ‘SMS’ @ 30 ఏళ్లు.. తొలి మెసేజ్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్లైన్లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్లు, మెసేంజర్ నుంచి మెసేజ్లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్షైర్కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్ఎంఎస్ ‘మెర్రీ క్రిస్మస్’. ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి ఆ సమయంలో వోడాఫోన్కు డైరెక్టర్గా ఉన్న రిచర్డ్ జార్విస్ .
మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్ఎంఎస్లు పంపించే మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1999లో ఇతర నెట్వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది .దీన్ని అనుసరిస్తూ జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమైంది. తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం క్రమంగా పెరిగిపోవడం, ఆపై స్మార్ట్ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్లు పంపడం, ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
Read Also: South Central Railway: హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్’.. ఈనెలలోనే ప్రారంభం
అయితే టెస్ట్ మెసేజ్అనేది ఇంత ఫేమస్ అవుతుందని 1992లో తనకు తెలియదని నీల్పాప్ వర్త్ అన్నారు. ఇప్పుడు మిలియన్ల మంది వాడుతున్న యాప్స్లో ఎమోజీలు కూడా వచ్చేశాయని.. ప్రపంచంలోనే తొలి మెసేజ్తానే పంపించానని ఇటీవలే తన పిల్లలకు చెప్పానని.. తాను పంపించిన ఆ మెసేజ్ మొబైల్ ఫోన్ చరిత్రలోనే అత్యంత కీలకంగా మారిందని ఇప్పుడు అనిపిస్తోందని నీల్ అభిప్రాయపడ్డాడు. కాగా మెసేజింగ్ఐడియా అనేది 1980లల్లో పుట్టుకొచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి దాదాపు పదేళ్లు పట్టింది. తొలినాళ్లల్లో మెసేజ్ ద్వారా కేవలం 160 క్యారెక్టర్లను పంపాల్సి ఉండేది. కానీ సోషల్ మీడియా యాప్స్ రాకతో మెసేజ్కు ప్రాధాన్యత తగ్గిపోయింది. కానీ అప్పట్లో ప్రతి ఏడాది బిలియన్ల కొద్ది మెసేజ్లు ఫార్వాడ్ అవుతూ ఉండేవి.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!