Text Message: ‘SMS’ @ 30 ఏళ్లు.. తొలి మెసేజ్ ఏంటో తెలుసా?
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్లైన్లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్లు, మెసేంజర్ నుంచి మెసేజ్లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్షైర్కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్ఎంఎస్ ‘మెర్రీ క్రిస్మస్’. ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి ఆ సమయంలో వోడాఫోన్కు డైరెక్టర్గా ఉన్న రిచర్డ్ జార్విస్ .
మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్ఎంఎస్లు పంపించే మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1999లో ఇతర నెట్వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది .దీన్ని అనుసరిస్తూ జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమైంది. తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం క్రమంగా పెరిగిపోవడం, ఆపై స్మార్ట్ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్లు పంపడం, ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
Also Read
- Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
- Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
- Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
- Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
Read Also: South Central Railway: హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్’.. ఈనెలలోనే ప్రారంభం
అయితే టెస్ట్ మెసేజ్అనేది ఇంత ఫేమస్ అవుతుందని 1992లో తనకు తెలియదని నీల్పాప్ వర్త్ అన్నారు. ఇప్పుడు మిలియన్ల మంది వాడుతున్న యాప్స్లో ఎమోజీలు కూడా వచ్చేశాయని.. ప్రపంచంలోనే తొలి మెసేజ్తానే పంపించానని ఇటీవలే తన పిల్లలకు చెప్పానని.. తాను పంపించిన ఆ మెసేజ్ మొబైల్ ఫోన్ చరిత్రలోనే అత్యంత కీలకంగా మారిందని ఇప్పుడు అనిపిస్తోందని నీల్ అభిప్రాయపడ్డాడు. కాగా మెసేజింగ్ఐడియా అనేది 1980లల్లో పుట్టుకొచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి దాదాపు పదేళ్లు పట్టింది. తొలినాళ్లల్లో మెసేజ్ ద్వారా కేవలం 160 క్యారెక్టర్లను పంపాల్సి ఉండేది. కానీ సోషల్ మీడియా యాప్స్ రాకతో మెసేజ్కు ప్రాధాన్యత తగ్గిపోయింది. కానీ అప్పట్లో ప్రతి ఏడాది బిలియన్ల కొద్ది మెసేజ్లు ఫార్వాడ్ అవుతూ ఉండేవి.
తాజావార్తలు
-
Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!
-
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
-
Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!