Petrol Rates: పెట్రోల్ ధర మరో రూ.33 తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే మరో రూ.33 తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు నుంచి జీఎస్టీ కౌన్సిట్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ ఛైర్మన్ వివేక్ దెబ్రోయ్ ఈ అంశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుందని సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా సంతోషమేనని, అయితే రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
Also Read
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. అందుకే పెట్రోల్ ధర కొండెక్కి కూర్చుంది. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించినా తమకు రాబడి తగ్గుతుందని చాలా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించడంలేదు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ఆ మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు. అదే జరిగితే మొత్తానికే జీఎస్టీ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!