Petrol Rates: పెట్రోల్ ధర మరో రూ.33 తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే..?
దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే మరో రూ.33 తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు నుంచి జీఎస్టీ కౌన్సిట్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్ ఛైర్మన్ వివేక్ దెబ్రోయ్ ఈ అంశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుందని సూచించారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా సంతోషమేనని, అయితే రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. అందుకే పెట్రోల్ ధర కొండెక్కి కూర్చుంది. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించినా తమకు రాబడి తగ్గుతుందని చాలా రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించడంలేదు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకువస్తే ఆ మొత్తం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే పరిస్థితి లేదు. అదే జరిగితే మొత్తానికే జీఎస్టీ మీద వ్యతిరేక గళం వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో