5 నెలల గరిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఐదు నెలల గరిష్ట స్థాయినితాకి 12.54 శాతానికి చేరుకుంది.. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ , విద్యుత్ ఖర్చులు ప్రాథమిక ఆహారేతర వస్తువుల నుండి కార్ల వరకు ధరలను పెంచాయని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా సూచిస్తోంది.. ఈ ఆర్థిక సంవత్సరం ఆది నుంచి ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ నమోదవుతున్నది.. సెప్టెంబర్లో 10.66 శాతానికి పడిపోయినా తిరిగి అక్టోబర్లో పెరిగింది… అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కెమికల్స్, రసాయన తదితర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.
Read Also: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. వారికి ఆర్థిక సహకారం
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
ఇక, సెప్టెంబర్లో 11.41 శాతంగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నెలలో 12.04 శాతానికి దూసుకెళ్లింది.. ఇంధన, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం 24.84 శాతం నుంచి 37.18 శాతానికి చేరుకుంటే.. క్రూడాయిల్ 71.86 నుంచి 80.57 శాతానికి పెరిగిపోయింది.. మరోవైపు నిత్యం వినియోగించే ఉల్లిగడ్డల ధరలు 25.01 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, అక్టోబర్లో అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం మూడు-దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అనేక కీలక ఆర్థిక వ్యవస్థలలో ధరలపై గ్లోబల్ సరఫరా స్క్వీజ్ బరువును పెంచింది, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరల యొక్క తాత్కాలిక దశ కంటే ఎక్కువ అంచనా వేయడానికి విశ్లేషకులు మొగ్గుచూపారు.. సరఫరా మరియు షిప్పింగ్ పరిమితులు, వస్తువులు మరియు సేవలకు పెరుగుతున్న డిమాండ్ అలాగే అధిక వేతనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారంగా ఉన్నాయి. అంతర్గత డిమాండ్ను తీర్చడానికి కీలకమైన ముడి పదార్థాలు మరియు భాగాలను దిగుమతి చేసుకునే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపాయి. సెమీకండక్టర్ల కొరత, కార్లు, ఉపకరణాలు మరియు మొబైల్ ఫోన్ల నుండి టెలివిజన్ సెట్ల వరకు అనేక రకాల వస్తువుల ఉత్పత్తిని నిర్వీర్యం చేసింది..చిప్ మేకర్లు చాలా ముఖ్యమైన భాగాన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నారు, తక్షణ పరిష్కరాలు లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!