5 నెలల గరిష్ఠాన్ని తాకిన ద్రవ్యోల్బణం.. కారణాలు ఇవేనా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఐదు నెలల గరిష్ట స్థాయినితాకి 12.54 శాతానికి చేరుకుంది.. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ , విద్యుత్ ఖర్చులు ప్రాథమిక ఆహారేతర వస్తువుల నుండి కార్ల వరకు ధరలను పెంచాయని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా సూచిస్తోంది.. ఈ ఆర్థిక సంవత్సరం ఆది నుంచి ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ నమోదవుతున్నది.. సెప్టెంబర్లో 10.66 శాతానికి పడిపోయినా తిరిగి అక్టోబర్లో పెరిగింది… అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కెమికల్స్, రసాయన తదితర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది.
Read Also: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. వారికి ఆర్థిక సహకారం
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
ఇక, సెప్టెంబర్లో 11.41 శాతంగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నెలలో 12.04 శాతానికి దూసుకెళ్లింది.. ఇంధన, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం 24.84 శాతం నుంచి 37.18 శాతానికి చేరుకుంటే.. క్రూడాయిల్ 71.86 నుంచి 80.57 శాతానికి పెరిగిపోయింది.. మరోవైపు నిత్యం వినియోగించే ఉల్లిగడ్డల ధరలు 25.01 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, అక్టోబర్లో అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం మూడు-దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అనేక కీలక ఆర్థిక వ్యవస్థలలో ధరలపై గ్లోబల్ సరఫరా స్క్వీజ్ బరువును పెంచింది, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరల యొక్క తాత్కాలిక దశ కంటే ఎక్కువ అంచనా వేయడానికి విశ్లేషకులు మొగ్గుచూపారు.. సరఫరా మరియు షిప్పింగ్ పరిమితులు, వస్తువులు మరియు సేవలకు పెరుగుతున్న డిమాండ్ అలాగే అధిక వేతనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారంగా ఉన్నాయి. అంతర్గత డిమాండ్ను తీర్చడానికి కీలకమైన ముడి పదార్థాలు మరియు భాగాలను దిగుమతి చేసుకునే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపాయి. సెమీకండక్టర్ల కొరత, కార్లు, ఉపకరణాలు మరియు మొబైల్ ఫోన్ల నుండి టెలివిజన్ సెట్ల వరకు అనేక రకాల వస్తువుల ఉత్పత్తిని నిర్వీర్యం చేసింది..చిప్ మేకర్లు చాలా ముఖ్యమైన భాగాన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నారు, తక్షణ పరిష్కరాలు లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!