REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
- తగ్గిన రెపో రేటు
- 6.50% నుంచి 6.25%కి తగ్గుదల
- అసలు రెపో రేటు అంటే ఏంటి?
- దీని ప్రభావం సామాన్యులపై ఏ మేరకు ఉంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
Also Read
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
- Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
- Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
రెపో రేటు అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి. ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. రేపో రేటునను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఆర్బీఐ తక్కువ రేటుకు రుణాలు ఇస్తే, బ్యాంకులు కూడా వినియోగదారులకు తక్కువ రేటుకు రుణాలు అందిస్తాయి. ఇందులో గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం మొదలైనవి ఉంటాయి. రెపో రేటు తగ్గింపు వల్ల మధ్యతరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇది ఈఎంఐ భారాన్ని కూడా బ్యాంకులు తగ్గించగలవు.. కానీ ఇక్కడే ఓ తిరకాసు కూడా ఉంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా బ్యాంకులు మాత్రం.. వాటి ప్రయోజనాలను సామాన్యులకు అందించక పోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకులు తమ ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి. అంటే రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపైనే ఆధారపడి ఉంటుంది.
READ MORE: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!
ఇదిలా ఉండగా.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. రెపో రేటు చివరిసారిగా మే 2020లో 0.40% తగ్గింది. ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించారు. 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచింది. చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2024లో జరిగింది.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!