REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
- తగ్గిన రెపో రేటు
- 6.50% నుంచి 6.25%కి తగ్గుదల
- అసలు రెపో రేటు అంటే ఏంటి?
- దీని ప్రభావం సామాన్యులపై ఏ మేరకు ఉంటుంది?
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
Also Read
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
రెపో రేటు అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి. ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. రేపో రేటునను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఆర్బీఐ తక్కువ రేటుకు రుణాలు ఇస్తే, బ్యాంకులు కూడా వినియోగదారులకు తక్కువ రేటుకు రుణాలు అందిస్తాయి. ఇందులో గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం మొదలైనవి ఉంటాయి. రెపో రేటు తగ్గింపు వల్ల మధ్యతరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇది ఈఎంఐ భారాన్ని కూడా బ్యాంకులు తగ్గించగలవు.. కానీ ఇక్కడే ఓ తిరకాసు కూడా ఉంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా బ్యాంకులు మాత్రం.. వాటి ప్రయోజనాలను సామాన్యులకు అందించక పోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకులు తమ ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి. అంటే రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపైనే ఆధారపడి ఉంటుంది.
READ MORE: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!
ఇదిలా ఉండగా.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. రెపో రేటు చివరిసారిగా మే 2020లో 0.40% తగ్గింది. ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించారు. 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచింది. చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2024లో జరిగింది.
తాజావార్తలు
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?