LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ సుమారు 1,00,000 ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి, కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించిన ఈ భారీ ప్రణాళికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కానుంది. వోక్స్వ్యాగన్ గ్రూప్ కింద ఆడి, బెంట్లీ, స్కోడా, సీట్, కుప్రా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్లో 6.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, సాంప్రదాయ ఇంధన కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా వోక్స్వ్యాగన్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
ఈ సంక్షోభంపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు, యూనియన్లతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన ఈ ప్రక్రియపై ఇప్పుడే వ్యాఖ్యానించలేమని తెలిపారు. అయితే, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు వోక్స్వ్యాగన్ గ్రూప్ ప్రస్తుతం తీవ్రమైన మార్పులకు లోనవుతున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. జర్మనీలో కార్లను డిజైన్ చేసి, ఐరోపాలో ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే పాత వ్యాపార నమూనా ఇకపై ఎంతమాత్రం పనిచేయదని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. చైనాకు చెందిన విప్లవాత్మక ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు ఐరోపా మార్కెట్లను ముంచెత్తుతుండటమే దీనికి ప్రధాన కారణం.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆలివర్ బ్లూమ్ ప్రతిపాదించిన ఈ భారీ వ్యూహాత్మక మార్పులపై వచ్చే నెలలో జరిగే సూపర్వైజరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కంపెనీ ఖర్చులను దాదాపు 11 బిలియన్ యూరోల మేర తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమనం, కొత్త టారిఫ్లు కంపెనీపై ఏటా పదుల బిలియన్ల యూరోల అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి మధ్యకాలికంగా జర్మనీలోని నెకర్సల్మ్లో ఉన్న ఆడి ప్లాంట్తో పాటు హనోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్లలోని వోక్స్వ్యాగన్ ప్లాంట్లు సహా మొత్తం నాలుగు ఫ్యాక్టరీలను మూసివేయాలని భావిస్తున్నారు. తీవ్రమైన పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే పెట్టుబడులు, ఖర్చులపై మరింత కఠినమైన నియంత్రణ అవసరమని కంపెనీ వర్గాలు అంటున్నాయి.
తాజావార్తలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!