LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ సుమారు 1,00,000 ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించి, కాలక్రమేణా వాటిని పూర్తిగా మూసివేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. నాటకీయంగా ఖర్చులను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ రూపొందించిన ఈ భారీ ప్రణాళికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో కంపెనీ ప్రకటించిన ఉద్యోగుల తొలగింపుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కానుంది. వోక్స్వ్యాగన్ గ్రూప్ కింద ఆడి, బెంట్లీ, స్కోడా, సీట్, కుప్రా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్లో 6.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, సాంప్రదాయ ఇంధన కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా వోక్స్వ్యాగన్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది.
Also Read
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
ఈ సంక్షోభంపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు, యూనియన్లతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన ఈ ప్రక్రియపై ఇప్పుడే వ్యాఖ్యానించలేమని తెలిపారు. అయితే, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు వోక్స్వ్యాగన్ గ్రూప్ ప్రస్తుతం తీవ్రమైన మార్పులకు లోనవుతున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. జర్మనీలో కార్లను డిజైన్ చేసి, ఐరోపాలో ఉత్పత్తి చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే పాత వ్యాపార నమూనా ఇకపై ఎంతమాత్రం పనిచేయదని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. చైనాకు చెందిన విప్లవాత్మక ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు ఐరోపా మార్కెట్లను ముంచెత్తుతుండటమే దీనికి ప్రధాన కారణం.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆలివర్ బ్లూమ్ ప్రతిపాదించిన ఈ భారీ వ్యూహాత్మక మార్పులపై వచ్చే నెలలో జరిగే సూపర్వైజరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కంపెనీ ఖర్చులను దాదాపు 11 బిలియన్ యూరోల మేర తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమనం, కొత్త టారిఫ్లు కంపెనీపై ఏటా పదుల బిలియన్ల యూరోల అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి మధ్యకాలికంగా జర్మనీలోని నెకర్సల్మ్లో ఉన్న ఆడి ప్లాంట్తో పాటు హనోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్లలోని వోక్స్వ్యాగన్ ప్లాంట్లు సహా మొత్తం నాలుగు ఫ్యాక్టరీలను మూసివేయాలని భావిస్తున్నారు. తీవ్రమైన పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే పెట్టుబడులు, ఖర్చులపై మరింత కఠినమైన నియంత్రణ అవసరమని కంపెనీ వర్గాలు అంటున్నాయి.
తాజావార్తలు
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!