Vedanta Demerger: బంపర్ ఆఫర్.. ఈ ఒక్క షేరు ఉంటే.. ఆరు షేర్లు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vedanta Demerger: ప్రముఖ మైనింగ్, మెటల్స్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ పెట్టుబడిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోను భారీగా పెంచనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత మీ వద్ద మొత్తం 6 షేర్లు ఉంటాయి.
READ ALSO: Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
Also Read
- Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
- RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
- Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్సీ పెద్దాయన కథ ఇదే!
కొత్తగా రాబోతున్న 5 కంపెనీలు ఇవే:
వ్యాపార కార్యకలాపాలను సరళీకృతం చేసేందుకు అనిల్ అగర్వాల్ వేదాంతను కింది ఐదు విభాగాలుగా విడగొడుతున్నట్లు తెలిపారు.
* వేదాంత అల్యూమినియం: అల్యూమినియం ఉత్పత్తి, వ్యాపారం.
* వేదాంత ఆయిల్ & గ్యాస్: చమురు, సహజ వాయువు రంగం.
* వేదాంత స్టీల్ & ఫెర్రస్: ఇనుము, ఉక్కు వ్యాపారం.
* వేదాంత బేస్ మెటల్స్: రాగి, జింక్ వంటి లోహాలపై దృష్టి.
* వేదాంత పవర్: విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని పర్యవేక్షిస్తుంది.
ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు.
ఈ భారీ నిర్ణయానికి కారణం ఇదే..
వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను విక్రయించడం ద్వారా ఈ అప్పు తీర్చడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ల మార్కెట్ క్యాప్, ఐదు కంపెనీలు విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విలువను సంతరించుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆయిల్, గ్యాస్, పవర్ వంటి అన్ని వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కింద ఉండేవి. ఇకపై ఇన్వెస్టర్లు తమకు నచ్చిన రంగంలో (ఉదాహరణకు కేవలం పవర్ లేదా ఆయిల్ రంగంలో మాత్రమే) పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రతి కంపెనీకి ప్రత్యేక బోర్డ్, యాజమాన్యం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వేదాంత ఇన్వెస్టర్లకు ఒక లాటరీ వంటిదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొంది, కొత్త కంపెనీలతో వేదాంత గ్రూప్ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.
READ ALSO: Nisha Mehta: నేపాల్ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థి..!
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..