UPI Charges: UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు.. ట్రాన్సాక్షన్స్ పై కొత్త ఛార్జీలు!
- UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు
- డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు
- వ్యాపారులు UPI, RuPay లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేశాయి. దాదాపు లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు.
Also Read:IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ప్రస్తుతం UPI, RuPay డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ MDR నుంచి మినహాయించబడ్డాయి. అయితే రూ. 40 లక్షల కంటే ఎక్కువ వార్షిక GST టర్నోవర్ ఉన్న వ్యాపారులకు MDR వర్తింపజేయాలని సూచిస్తూ బ్యాంకులు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాయి.పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులు, వివిధ క్రెడిట్ కార్డులపై MDR చెల్లిస్తున్నారని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాపారులు UPI, RuPay లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
Also Read:Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది
2022 కి ముందు బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 1 శాతం కంటే తక్కువ MDR వసూలు చేసేవి. అయితే, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం FY22 బడ్జెట్లో ఈ ఛార్జీలను తొలగించింది. MDR పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వ్యాపారులు, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు వినియోగదారులపై కూడా ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కాగా ఫిబ్రవరి 2025లో UPI 1,611 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. దీని విలువ రూ.21.96 లక్షల కోట్లు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!