Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్లో కూడా..
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) విమాన ప్రయాణికులకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్తను అందించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద భారంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్’ (UDAN Yatri Cafe) అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలను దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే జాతీయ విమానయాన విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ 2024, డిసెంబర్ 19న కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. దీనికి లభించిన విశేష స్పందనతో.. తదుపరి కేఫ్ను చెన్నై విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సేవలు హైదరాబాద్, విజయవాడ, ముంబై, అహ్మదాబాద్, పూణే, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూర్, త్రివేండ్రం, మంగళూరు, రాజ్కోట్, చండీగఢ్, జమ్మూ, పాట్నా, ఇండోర్, అమృత్సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జైపూర్, లక్నో మరియు అరుణాచల్ ప్రదేశ్లోని హోలోంగి వంటి 24 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. లోక్సభలో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) నమూనాలో నడిచే విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి తక్కువ ధరల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని ఆపరేటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
Also Read:Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!
ఈ కేఫ్ల ప్రధాన ఉద్దేశం.. నాణ్యమైన ఆహారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే అందించడం. ఈ మెనూలో మంచినీళ్ల బాటిల్ కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఒక కప్పు టీ ధర 10 రూపాయలు, కాఫీ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. చిరుతిండి విషయానికి వస్తే.. ప్రసిద్ధ భారతీయ స్నాక్ అయిన సమోసా 20 రూపాయలకే అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం (Sweet of the Day) కూడా 20 రూపాయలకే విక్రయిస్తారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంతో పాటు, ప్రయాణీకుల ప్రాథమిక అవసరాలను సరసమైన ధరలకే అందించనున్నారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?