Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్లో కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) విమాన ప్రయాణికులకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్తను అందించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద భారంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్’ (UDAN Yatri Cafe) అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలను దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే జాతీయ విమానయాన విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ 2024, డిసెంబర్ 19న కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. దీనికి లభించిన విశేష స్పందనతో.. తదుపరి కేఫ్ను చెన్నై విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సేవలు హైదరాబాద్, విజయవాడ, ముంబై, అహ్మదాబాద్, పూణే, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూర్, త్రివేండ్రం, మంగళూరు, రాజ్కోట్, చండీగఢ్, జమ్మూ, పాట్నా, ఇండోర్, అమృత్సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జైపూర్, లక్నో మరియు అరుణాచల్ ప్రదేశ్లోని హోలోంగి వంటి 24 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. లోక్సభలో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) నమూనాలో నడిచే విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి తక్కువ ధరల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని ఆపరేటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
Also Read:Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!
ఈ కేఫ్ల ప్రధాన ఉద్దేశం.. నాణ్యమైన ఆహారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే అందించడం. ఈ మెనూలో మంచినీళ్ల బాటిల్ కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఒక కప్పు టీ ధర 10 రూపాయలు, కాఫీ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. చిరుతిండి విషయానికి వస్తే.. ప్రసిద్ధ భారతీయ స్నాక్ అయిన సమోసా 20 రూపాయలకే అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం (Sweet of the Day) కూడా 20 రూపాయలకే విక్రయిస్తారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంతో పాటు, ప్రయాణీకుల ప్రాథమిక అవసరాలను సరసమైన ధరలకే అందించనున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!