Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్లో కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) విమాన ప్రయాణికులకు ఒక గొప్ప ఊరటనిచ్చే వార్తను అందించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద భారంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్’ (UDAN Yatri Cafe) అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలను దేశవ్యాప్తంగా 24 ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే జాతీయ విమానయాన విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ 2024, డిసెంబర్ 19న కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైంది. దీనికి లభించిన విశేష స్పందనతో.. తదుపరి కేఫ్ను చెన్నై విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సేవలు హైదరాబాద్, విజయవాడ, ముంబై, అహ్మదాబాద్, పూణే, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూర్, త్రివేండ్రం, మంగళూరు, రాజ్కోట్, చండీగఢ్, జమ్మూ, పాట్నా, ఇండోర్, అమృత్సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జైపూర్, లక్నో మరియు అరుణాచల్ ప్రదేశ్లోని హోలోంగి వంటి 24 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. లోక్సభలో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) నమూనాలో నడిచే విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి తక్కువ ధరల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని ఆపరేటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
Also Read:Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!
ఈ కేఫ్ల ప్రధాన ఉద్దేశం.. నాణ్యమైన ఆహారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే అందించడం. ఈ మెనూలో మంచినీళ్ల బాటిల్ కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఒక కప్పు టీ ధర 10 రూపాయలు, కాఫీ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. చిరుతిండి విషయానికి వస్తే.. ప్రసిద్ధ భారతీయ స్నాక్ అయిన సమోసా 20 రూపాయలకే అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన తీపి పదార్థం (Sweet of the Day) కూడా 20 రూపాయలకే విక్రయిస్తారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంతో పాటు, ప్రయాణీకుల ప్రాథమిక అవసరాలను సరసమైన ధరలకే అందించనున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!