Trump Tariffs: రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్పై 50% శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు.. భారత్ రష్యన్ చమురు కొనుగోలును ఆపివేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ట్రంప్ ఊహించలేదు కావొచ్చు. రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తుంది కాబట్టే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
రష్యా చమురు మార్కెట్ల నుంచి భారత్ అకస్మాత్తుగా వైదొలగడం వల్ల ప్రపంచ స్థాయిలో ముడి చమురు ధరలు బ్యారెల్కు $200 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ముప్పుగా మారుతుందని చెబుతున్నారు. భారత్ రష్యన్ చమురు కొనుగోలు చేయడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముప్పు నివారించబడిందని స్పష్టం చేస్తున్నారు.
READ MORE: KTR: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో దోస్తీ డ్రామా.. మోడీతో కుస్తీ డ్రామా
రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్లకు స్థిరత్వాన్ని తెచ్చిపెట్టిందనే వాదనను అమెరికా అధికారులు గతంలో అంగీకరించారు. భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తుండటంతో సంతోషంగా ఉన్నామని అమెరికా ఆర్థిక మంత్రి (నవంబర్ 2022) తన ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో ఇంధన సలహాదారు (2024) సైతం భారత్ ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడిందని స్పష్టం చేశారు. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి (మే 2024) సైతం ఈ అంశంపై గతంలో భారత్ను మెచ్చుకున్నారు. ఈ ప్రకటనల ద్వారా భారత్ సొంత లాభం కోసం చమురును కొనుగోలు చేయడం లేదని స్పష్టమవుతోంది. ఈ అంశాన్ని ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ గుర్తించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!