India Russia Relations: భారత్, రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సుంకాలు విధించిన భారత్ తగ్గేదేలే అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్లోని రష్యా రాయబారి కీలక ప్రకటన చేశారు.
Trump Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్పై 50% శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.