Trump Tariffs: ట్రంప్ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs – Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యాన్ని తిరస్కరించడంతో ఇందంతా చేస్తున్నారని.. అమెరికాకు చెందిన ఒక విశ్లేషకుడు అన్నారు.
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
గత రెండు దశాబ్దాలలో భారత వస్తువులపై అమెరికా అదనంగా 25% సుంకం (మొత్తం 50% సుంకం) విధించడం రెండు దేశాల మధ్య సంబంధాలలో ‘అత్యంత దారుణమైన సంక్షోభం’ అని వాషింగ్టన్కు చెందిన దక్షిణాసియా విశ్లేషకుడు, విదేశాంగ నిపుణుడు మైఖేల్ కుగెల్మన్ అన్నారు. కాల్పుల విరమణలో భారత్ దృఢమైన, స్వతంత్ర వైఖరిని ట్రంప్ తనకు జరిగిన వ్యక్తిగత అవమానంగా భావించారని.. దీంతో న్యూఢిల్లీపై చర్యలు తీసుకుంటున్నారని విల్సన్ సెంటర్లోని సౌత్ ఆసియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంటే భారత్ కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యం లేదని తెలపడం ట్రంప్కు నచ్చలేదు. దీంతో ఆయన సుంకాలను విధించారని మైఖేల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాస్తవానికి… ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణను ఒప్పుకుంది. కానీ ట్రంప్ చాలాసార్లు తాను మధ్యవర్తిత్వం వహించి భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని పేర్కొన్నారు. భారత్ మొదటి రోజు నుండే ట్రంప్ వాదనలను ఖండించింది. పాకిస్థాన్ డీజీఎంవో అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ చేపట్టామని.. విదేశాంగ మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరూ స్పష్టం చేశారు. ట్రంప్ పేరు చెప్పకుండానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ‘ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ సిందూర్ ఆపమని మమ్మల్ని అడగలేదు’ అని స్పష్టం చేశారు.
READ MORE: TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?
తాజావార్తలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!