Trump Tariffs: ట్రంప్ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs – Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యాన్ని తిరస్కరించడంతో ఇందంతా చేస్తున్నారని.. అమెరికాకు చెందిన ఒక విశ్లేషకుడు అన్నారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
గత రెండు దశాబ్దాలలో భారత వస్తువులపై అమెరికా అదనంగా 25% సుంకం (మొత్తం 50% సుంకం) విధించడం రెండు దేశాల మధ్య సంబంధాలలో ‘అత్యంత దారుణమైన సంక్షోభం’ అని వాషింగ్టన్కు చెందిన దక్షిణాసియా విశ్లేషకుడు, విదేశాంగ నిపుణుడు మైఖేల్ కుగెల్మన్ అన్నారు. కాల్పుల విరమణలో భారత్ దృఢమైన, స్వతంత్ర వైఖరిని ట్రంప్ తనకు జరిగిన వ్యక్తిగత అవమానంగా భావించారని.. దీంతో న్యూఢిల్లీపై చర్యలు తీసుకుంటున్నారని విల్సన్ సెంటర్లోని సౌత్ ఆసియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంటే భారత్ కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యం లేదని తెలపడం ట్రంప్కు నచ్చలేదు. దీంతో ఆయన సుంకాలను విధించారని మైఖేల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాస్తవానికి… ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణను ఒప్పుకుంది. కానీ ట్రంప్ చాలాసార్లు తాను మధ్యవర్తిత్వం వహించి భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని పేర్కొన్నారు. భారత్ మొదటి రోజు నుండే ట్రంప్ వాదనలను ఖండించింది. పాకిస్థాన్ డీజీఎంవో అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ చేపట్టామని.. విదేశాంగ మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరూ స్పష్టం చేశారు. ట్రంప్ పేరు చెప్పకుండానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ‘ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ సిందూర్ ఆపమని మమ్మల్ని అడగలేదు’ అని స్పష్టం చేశారు.
READ MORE: TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!