Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Election: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని రాజ్యాంగ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారని రిజిజు తెలిపారు.
READ MORE: Komatireddy: ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాకు రాహుల్, ఖర్గే డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Also Read
- Suvendu Adhikari: "సువేందు అధికారి అనే నేను".. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
- Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
- Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
- Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
ఈ భేటీలో ఎన్డీఏ ఎంపీల మధ్య పరస్పర సమన్వయం, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి.. ఎటువంటి విప్ జారీ చేయబడదన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్క అభ్యర్థి చెల్లని ఓటు వేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతిక లోపం తలెత్తకుండా, అభ్యర్థులు కరెక్ట్గా ఓటు వేసేలా ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియను రిహార్సల్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వర్గాలు తెలిపారు.
READ MORE: MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్
ఇదిలా ఉండగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని “జనసేన” అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అంతిమ నిర్ణయం ప్రధాని మోడీకే విడిచిపెడుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు మాటగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..