Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Election: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అన్ని రాజ్యాంగ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారని రిజిజు తెలిపారు.
READ MORE: Komatireddy: ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాకు రాహుల్, ఖర్గే డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Also Read
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
- BCCI: క్రికెట్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం
- Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
ఈ భేటీలో ఎన్డీఏ ఎంపీల మధ్య పరస్పర సమన్వయం, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి.. ఎటువంటి విప్ జారీ చేయబడదన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్క అభ్యర్థి చెల్లని ఓటు వేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతిక లోపం తలెత్తకుండా, అభ్యర్థులు కరెక్ట్గా ఓటు వేసేలా ఎన్డీఏ ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియను రిహార్సల్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు వర్గాలు తెలిపారు.
READ MORE: MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్
ఇదిలా ఉండగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి హాజరయ్యారు. ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయమే తమ నిర్ణయమని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని “జనసేన” అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అంతిమ నిర్ణయం ప్రధాని మోడీకే విడిచిపెడుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు మాటగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!