Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
భారత్పై సుంకాలను తగ్గిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసింది. ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్పై గట్టి ప్రభావాన్ని చూపింది. దీంతో దేశంలోని ప్రముఖ కంపెనీల విలువలు గణనీయంగా పెరిగాయి. టాప్ 10 కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ షేర్లు 7% పెరిగాయి, ఇన్ఫోసిస్, TCS షేర్లు 5% కంటే ఎక్కువ లాభాలను పొందాయి. అలాగే SBI కూడా 6% పెరిగింది. దీంతో ఈ ప్రధాన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఒక్కరోజులోనే రూ.5.40 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 4,200 పాయింట్లకు పైగా దూసుకువెళ్లింది.
పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్లో భారీ పెరుగుదల..
* మంగళవారం ట్రేడింగ్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7 శాతానికి పైగా పెరిగాయి. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,33,768.49 కోట్లు పెరిగి రూ.20,14,985.17 కోట్లకు చేరుకుంది.
* ట్రేడింగ్ సెషన్లో HDFC బ్యాంక్ షేర్లు దాదాపు 7 శాతం పెరిగాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.96,488.38 కోట్లు పెరిగి, రూ.15,23,500.64 కోట్లకు చేరుకుంది.
* దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.41,068.96 కోట్లు పెరిగి, రూ.7,17,865.49 కోట్లకు చేరువ అయ్యింది.
* టీసీఎస్ షేర్లు ఈ రోజు 5.28% పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.60,563.02 కోట్లు పెరిగి, రూ.12,07,172.33 కోట్లకు చేరుకుంది.
* ICICI బ్యాంక్ షేర్లు 4.72 శాతం పెరిగింది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.45,637.64 కోట్లు పెరిగి, రూ.10,12,898.08 కోట్లకు చేరువ అయ్యింది.
* ఇదే సమయంలో ఎస్బీఐ షేర్లు కూడా దాదాపు 6 శాతం మేర పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే రూ.56,803.76 కోట్లు పెరిగి, రూ.10,05,948.20 కోట్లకు చేరుకుంది.
* దేశంలో అతిపెద్ద FMCG కంపెనీ అయిన హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి, దాని మార్కెట్ క్యాప్ రూ.10,291.21 కోట్లకు, విలువ రూ.5,63,807.91 కోట్లకు చేరుకుంది.
* ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 7.76 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి రూ.43,681.84 కోట్లు పెరిగి, రూ.6,06,412.23 కోట్లకు చేరుకుంది.
* దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన LIC షేర్లు ట్రేడింగ్ సెషన్లో 4.87 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,762.37 కోట్లు పెరిగి, రూ.5,33,134.05 కోట్లకు చేరుకుంది.
* అలాగే ఎల్ అండ్ టి షేర్లు కూడా 5 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే.. రూ.27,229.62 కోట్లు పెరిగి, రూ. 5,66,732.44 కోట్లకు చేరుకుంది.
READ ALSO: Rajamouli: ‘వారణాసి’ కోసం క్యూ కడుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కానీ జక్కన్న ప్లాన్ ఇదే!
