Diamond Crossing: దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్.. రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి..
- దేశంలోని ఏకైక డైమండ్ క్రాసింగ్
- ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది
- రైళ్లు నాలుగు వైపులా దుసుకెళ్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రైల్వే రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సరుకు రవాణాలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. సౌకర్యవంతం, సురక్షితం, చౌకైన రవాణా వ్యవస్థగా పేరొందింది. అందుకే దీనిని దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు చాలాసార్లు క్రాసింగ్లను దాటుతున్న రైళ్లను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి రైళ్లు ప్రయాణించి, ఒకదానికొకటి ఢీకొనని రైల్వే క్రాసింగ్ను చూశారా? భారత్ లో ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. అక్కడ రైళ్లు అన్ని దిశల నుండి – తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నుండి ప్రయాణిస్తాయి. ఈ క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది. దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఇక్కడ అన్ని దిశల నుండి పట్టాలు ఒకదానికొకటి కలుస్తాయి.
Also Read:Putin In India: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్.. స్వయంగా స్వాగతించిన మోడీ..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
నాగ్పూర్లో డైమండ్ క్రాసింగ్
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటి. దేశంలోని నాలుగు ప్రధాన రైలు మార్గాలు ఇక్కడ కలుస్తాయి. ఇది వజ్రం ఆకారపు దృశ్యాన్ని సృష్టిస్తుంది. అందుకే దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను తీసుకువెళతాయి.
Also Read:Dil Raju: శ్రీ తేజ రిహాబిలిటేషన్ కేంద్రం ఖర్చు కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు
రైళ్లు ఎందుకు ఢీకొనవు?
ఇప్పుడు, ఈ రైళ్లు ఎందుకు ఢీకొనవని మీరు ఆలోచిస్తున్నారా? ఇది ఇంజనీరింగ్ అద్భుతం. దీని విజయ రహస్యం దాని ఇంటర్లాకింగ్ సిస్టం, ఆటోమేటిక్ సిగ్నల్ టెక్నాలజీలో ఉంది. ఈ వ్యవస్థ ఒకేసారి ఒక రైలు మాత్రమే క్రాసింగ్ను దాటడానికి అనుమతించే విధంగా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ రైళ్లను క్రాసింగ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా నడిచేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!