Telangana Company: తెలంగాణ కంపెనీకి ‘మహా’ ఆర్డర్
Telangana Company: హైదరాబాద్లోని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్, మెయింటనెన్స్ బాధ్యతలను థానే మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. లిథియం అయాన్లతో రూపొందించే ఈ బస్సుల బ్యాటరీలను నాలుగు గంటల్లోనే రీఛార్జ్ చేయొచ్చు. 55 బస్సులను 12 మీటర్ల పొడవున, 68 బస్సులను 9 మీటర్ల పొడవున తయారుచేయనున్నారు.
కిమ్స్లోని షేర్ల అమ్మకం
Also Read
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని 12 లక్షలకు పైగా షేర్లను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షేర్లను 151 కోట్ల 25 లక్షల రూపాయలకు ఓపెన్ మార్కెట్లో అమ్మినట్లు తెలుస్తోంది. ఒక్కో షేర్ యావరేజ్గా 12 వందల 50 రూపాయలు పలికినట్లు బీఎస్ఈ బల్క్ డీల్స్ని బట్టి అర్థమవుతోంది. ఈ నెలారంభంలో కూడా ఈ సంస్థ పదహారున్నర లక్షలకు పైగా షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికం ముగిసేనాటికి కిమ్స్లో జనరల్ అట్లాంటిక్కి 17 పాయింట్ రెండు నాలుగు శాతం వాటా ఉంది.
RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
‘రూపాయి-రియాల్స్’లో చెల్లింపులు
ఇండియా కరెన్సీ రూపాయి, సౌదీ అరేబియా కరెన్సీ రియాల్స్లో వాణిజ్య చెల్లింపులు చేసేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు కోసం ఈ రెండు దేశాలు లేటెస్టుగా చర్చలు జరిపాయి. దీంతోపాటు ఆ గల్ఫ్ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టమ్ను మరియు రూపే కార్డును ప్రవేశపెట్టే విషయం కూడా ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ నెల 18 మరియు 19 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన వివిధ అంశాలపై సౌదీ అరేబియాతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై రూపాయల్లో చేయాలని ఆర్బీఐ ఈమధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!