Stock Market: నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్ అవ్వడంతో లాభాల సూచీల పరుగుకు బ్రేక్ పడినట్లయింది.
CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
Also Read
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
నేడు సెన్సెక్స్ ఉదయం 73,516 పాయింట్ల వద్ద మొదట లాభాల్లో ప్రారంభమైంది. ఇక ఇంట్రాడే విషయానికి వస్తే 73,342 – 74,4004 మధ్య మార్కెట్ చలించింది. దీంతో నేడు సెన్సెక్స్ చివరికి 165 పాయింట్ల లాభంతో 73,667 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో 22,335 వద్ద స్థిరపడింది. ఇక డాలర్ విషయం చూస్తే.. రూపాయి మారకం విలువ 82.78గా కొనసాగింది. నేటి సెన్సెక్స్ – 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డ వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఇక మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.84 డాలర్ల వద్ద కొనసాగుతుండగా., మరోవైపు బంగారం ఔన్సు 2,181.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు నిఫ్టీ బ్యాంక్ 45.45 పాయింట్లు నష్టపోయి 47282 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ ఐటీ ఏకంగా 235 పాయింట్లు ఎగబాకి 37224 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ భారీగా 923 పాయింట్ల నష్టంతో 42831 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మొదట కాస్త ఉత్సాహంగానే మార్కెట్ మొదలైనప్పటికీ మదుపర్లు మొదటి భాగంలో అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్ళింది. అయితే తిరిగి మదుపర్లు స్టాక్స్ ను కొనుగోలు చేయడంతో స్వల్ప లాభాలతో నేడు మార్కెట్ ముగిసింది.
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?