Stock Market: నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్ అవ్వడంతో లాభాల సూచీల పరుగుకు బ్రేక్ పడినట్లయింది.
CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
నేడు సెన్సెక్స్ ఉదయం 73,516 పాయింట్ల వద్ద మొదట లాభాల్లో ప్రారంభమైంది. ఇక ఇంట్రాడే విషయానికి వస్తే 73,342 – 74,4004 మధ్య మార్కెట్ చలించింది. దీంతో నేడు సెన్సెక్స్ చివరికి 165 పాయింట్ల లాభంతో 73,667 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో 22,335 వద్ద స్థిరపడింది. ఇక డాలర్ విషయం చూస్తే.. రూపాయి మారకం విలువ 82.78గా కొనసాగింది. నేటి సెన్సెక్స్ – 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డ వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఇక మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.84 డాలర్ల వద్ద కొనసాగుతుండగా., మరోవైపు బంగారం ఔన్సు 2,181.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు నిఫ్టీ బ్యాంక్ 45.45 పాయింట్లు నష్టపోయి 47282 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ ఐటీ ఏకంగా 235 పాయింట్లు ఎగబాకి 37224 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ భారీగా 923 పాయింట్ల నష్టంతో 42831 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మొదట కాస్త ఉత్సాహంగానే మార్కెట్ మొదలైనప్పటికీ మదుపర్లు మొదటి భాగంలో అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్ళింది. అయితే తిరిగి మదుపర్లు స్టాక్స్ ను కొనుగోలు చేయడంతో స్వల్ప లాభాలతో నేడు మార్కెట్ ముగిసింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!