Stock Market: నష్టాల నుంచి లాభాల వైపు పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Updates in Telugu: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి నేడు స్వల్ప లాభాల వైపు నడిచింది స్టాక్ మార్కెట్. నేటి ఉదయం మొదటగా లాభాల్లో ప్రారంభమైన అదే ఒరవడిని కొనసాగించ లేకపోయాయి. భారతీయ కంపెనీ ఐటీసీ లో బ్రిటిష్ – అమెరికన్ టొబాకో కంపెనీ వాటాలు అమ్ముతున్నట్లు ప్రకటించిన కారణంగా ఐటీసీ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. దీంతో అధిక వెయిటేజీ ఉన్న స్టాక్ అవ్వడంతో లాభాల సూచీల పరుగుకు బ్రేక్ పడినట్లయింది.
CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
Also Read
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
నేడు సెన్సెక్స్ ఉదయం 73,516 పాయింట్ల వద్ద మొదట లాభాల్లో ప్రారంభమైంది. ఇక ఇంట్రాడే విషయానికి వస్తే 73,342 – 74,4004 మధ్య మార్కెట్ చలించింది. దీంతో నేడు సెన్సెక్స్ చివరికి 165 పాయింట్ల లాభంతో 73,667 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 3 పాయింట్ల లాభంతో 22,335 వద్ద స్థిరపడింది. ఇక డాలర్ విషయం చూస్తే.. రూపాయి మారకం విలువ 82.78గా కొనసాగింది. నేటి సెన్సెక్స్ – 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభపడ్డ వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
ఇక మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.84 డాలర్ల వద్ద కొనసాగుతుండగా., మరోవైపు బంగారం ఔన్సు 2,181.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేడు నిఫ్టీ బ్యాంక్ 45.45 పాయింట్లు నష్టపోయి 47282 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ ఐటీ ఏకంగా 235 పాయింట్లు ఎగబాకి 37224 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ భారీగా 923 పాయింట్ల నష్టంతో 42831 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మొదట కాస్త ఉత్సాహంగానే మార్కెట్ మొదలైనప్పటికీ మదుపర్లు మొదటి భాగంలో అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్ళింది. అయితే తిరిగి మదుపర్లు స్టాక్స్ ను కొనుగోలు చేయడంతో స్వల్ప లాభాలతో నేడు మార్కెట్ ముగిసింది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!