CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్..!
CM Jagan inaugurated Juvvaladinne fishing harbour today: చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఏకంగా రూ.3.793 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో మొదటి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగిస్తున్న రాష్ట్ర మత్స్యకారుల పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. నేడు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ జువ్వలదిన్నె హార్బర్ ను ప్రారంభించనున్నారు. ఈ హార్బర్ ద్వారా ఏకంగా 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
Geetanjali Suicide Case: గీతాంజలి ఫ్యామిలీకి అండగా సీఎం జగన్.. రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
ఇందులో 1250 బోట్లను నిలిపేలా ఈ హార్బర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో వారు తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ప్రతి సంవత్సరం 41 వేల టన్నుల మత్స్య సంపద అదనంగా రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. ఈ పోర్టుల నిర్మాణంతో ఎక్కువ మొత్తంలో మత్స్యకారుల ఉపాధి, అలాగే అతి తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునేలా అవకాశం లభిస్తుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలో భాగంగా ఓఎన్బీసీ పైన్ నిర్మాణం చేయడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాల వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. ఇందులో భాగంగా 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 69 వేల చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ఐదో విడత నష్టపరిహారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
తాజావార్తలు
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
-
MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
-
Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
-
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!