Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్
- 24 గంట్లోనే నష్టాల్లోంచి లాభాల్లోకి
- భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. దేశీయ మార్కెట్ తెప్పరిల్లింది. నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. 24 గంటల్లోనే వేగంగా కోలుకుంది. శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. ప్రస్తుతం అన్ని రంగాలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. హార్ముజ్ కోసం ఐరోపా, జపాన్ దేశాలు ఏకమయ్యాయి. ఇరాన్తో కలిసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో మార్కెట్కు సరికొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 839 పాయింట్లు లాభపడి 75, 046 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 260 పాయింట్లు లాభపడి 23, 362 దగ్గర కొనసాగుతోంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92.94 దగ్గర రికార్డ్ కనిష్టానికి పడిపోయింది.
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన లాభాల్లో ఉండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిండాల్కో, ఒఎన్జీసీ నష్టపోయాయి. పవర్, పీఎస్యు బ్యాంక్, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Also Read
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ఇది కూడా చదవండి: Iran-Israel War: హార్ముజ్ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అయితే ఆశ్చర్యంగా ఈ వారం ప్రారంభంలో మూడు రోజులు జోరుగా లాభాలు వచ్చాయి. ఇంతలోనే ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగిపోతాయన్న భయాందోళనలు రేకెత్తడంతో నిన్న మార్కెట్ ఢమాల్ అయింది. నిన్న ఒక్కరోజే 12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మొత్తంగా గత 20 రోజుల యుద్ధంగా కారణంగా ఇప్పటి వరకు 37 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!