Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- రైల్వే ప్రయాణికులకు అలర్ట్..
- 15 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు మరియు భద్రతా కారణాల దృష్ట్యా సుమారు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల నిత్యం రైళ్లలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే మెము (MEMU) , డెము (DEMU) రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి.
విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు , సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నడిచే లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. వేసవి కాలం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. సురక్షిత ప్రయాణం కోసం ట్రాక్ మరమ్మతులు అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
Also Read
- ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
Also Read:Post Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..
ఈ 15 రైళ్ల రద్దు ఏప్రిల్ 12, 2026 వరకు అమలులో ఉంటుంది. రద్దైన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ – విశాఖపట్నం (07466/07467), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07456/07457), విజయవాడ – తెనాలి (07282/07279), విజయవాడ – ఒంగోలు (07278/07476), గుంటూరు – తెనాలి (07575/07440), విశాఖపట్నం – మచిలీపట్నం (17220), మచిలీపట్నం – విశాఖపట్నం (17219).
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు రైల్వే ఎంక్వయిరీ లేదా ‘నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్’ (NTES) యాప్ ద్వారా రైళ్ల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్టేషన్లకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైల్వే వెబ్సైట్ను కూడా పరిశీలించాలని కోరారు. రద్దైన రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!