Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నేడు సరికొత్త ఉత్సాహం నెలకొంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతానికి పైగా పతనం కావడం దేశీయ మార్కెట్లకు భారీ బూస్ట్నిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. శాంతి చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల జల్లు కురిపించాయి.
నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,074 పాయింట్లు (1.42 శాతం) పెరిగి 76,488 వద్ద స్థిరపడగా, నిఫ్టీ50 సూచీ 312 పాయింట్లు (1.32 శాతం) లాభంతో 24,031 వద్ద 24 వేల మార్కును దాటి ముగిసింది.
Also Read
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
- GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
- Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
నాలుగో త్రైమాసిక (Q4) బలమైన ఫలితాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ను ముందుండి నడిపించాయి. వీటితో పాటు ఆటోమొబైల్, రియల్టీ రంగాలు కూడా భారీగా లాభపడ్డాయి. జెఎస్డబ్ల్యూ సిమెంట్ క్యూ4 లాభాలు 2,162 శాతం పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా 2 శాతం లాభాల స్వీకరణకు గురై రూ. 135.76 వద్ద ముగిసింది.
గత వారం మార్కెట్ ఇలా..
గత వారం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ క్షీణత మార్కెట్ను ఒత్తిడికి గురిచేశాయి. సూచీలు కీలక సపోర్ట్ స్థాయిలను పరీక్షించే దిశగా కదలాడాయి. నేటి భారీ ర్యాలీతో మార్కెట్ కీలకమైన రివర్సల్ జోన్ను దాటినట్లు కనిపిస్తున్నప్పటికీ.. విశ్లేషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నిఫ్టీ 23,800–23,900 పరిధిని దాటి నిలదొక్కుకోవడం సానుకూల అంశం. అయితే మార్కెట్ లాభాల పరంపరను కొనసాగించాలంటే ఈ స్థాయిల పైన స్థిరంగా ముగియాల్సి ఉంటుంది. ఒకవేళ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే, మార్కెట్ కరెక్షన్కు గురై తిరిగి 23,200 నుంచి 23,000 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరల స్థిరత్వం, అంతర్జాతీయ దిగుబడుల తగ్గుదలపైనే రేపటి నుంచి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది. జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే ఈ వారం మార్కెట్ మరిన్ని రికార్డులను సృష్టించవచ్చు.
తాజావార్తలు
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
-
US: తక్షణమే పశ్చిమాసియాను ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
-
Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్తో సంబంధం ఏంటి..?
-
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
-
Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!