Pawan Khera : సెబీ చీఫ్ కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.16.80 కోట్ల జీతం!.. కాంగ్రెస్ ఆరోపణలు
- సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ ఆరోపణలు
- ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.16.80 కోట్ల జీతం తీసుకున్నారని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ సోమవారం పలు ఆరోపణలు చేసింది. మాధబి 2017 నుంచి 2021 వరకు సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. 2022లో ఆమె ఛైర్పర్సన్ అయ్యారు. 2017 నుంచి 2024 మధ్య మాధవి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.16.80 కోట్ల జీతం తీసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కాలంలో మాధబి సెబితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కూడా జీతం తీసుకున్నారని ఆరోపించారు. ఇది ప్రయోజనాల పరస్పర విరుద్ధమైన అంశమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలపై మాదబి నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.
READ MORE: Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ
Also Read
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
ఈ సందర్భంగా సెబీ నిజాయితీపై పవన్ ఖేరా ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్ రెగ్యులేటర్ నిష్పాక్షికతను, స్వతంత్రతను కొనసాగించాలన్నారు. సెబి చీఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ సంస్థ నుంచి జీతం పొందుతున్నప్పుడు సెబి నిష్పాక్షికతను ఎలా నిర్ధారించగలరని ఖేడా ప్రశించారు? సెబీపై ‘బాహ్య ప్రభావం’ లేదని నిర్ధారించడానికి ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
READ MORE:Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..
గత నెలలో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టులో
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్.. గతంలో సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్ లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. అదానీకి చెందిన మారిషన్, అఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని అఫ్ ఫోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్ లో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ పేర్కొంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!