SBI: కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. నేటి నుంచే అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన కస్టమర్లకు షాకిచ్చింది.. వడ్డీ రేట్లను మరోసారి వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ని 70 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) లేదా 0.7 శాతం నుండి 14.85 శాతానికి పెంచేసింది.. ప్రస్తుత బీపీఎల్ఆర్ 14.15 శాతంగా ఉండగా.. అది 14.85 శాతానికి పెరగనుంది.. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి 70 బీపీఎస్లు పెంచనుంది. దీంతో వీటి ఆధారంగా బ్యాంక్ ఇచ్చే గృహ, వాహన, విద్య, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. ఎస్బీఐ తన బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుతో పాటు బేస్ రేటును గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ సవరించిన విషయం విదితమే.. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లను ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొంది ఎస్బీఐ.
Read Also: NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
అయితే పబ్లిక్ లెండర్, ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ కాస్ట్ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. ఎస్బీఐ చివరిసారిగా ఎంసీఎల్ఆర్ రేట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 15న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. ప్రస్తుతం, ఓవర్నైట్ ఎంసీఎల్ 7.95 శాతంగా ఉండగా, నెలవారీ ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు మరియు ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు వరుసగా 8.10 శాతం మరియు 8.40 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల రుణాలు మరియు మూడేళ్ల రుణాలకు ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫిబ్రవరి 8న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన తర్వాత ఎస్బీఐ తన కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటును పెంచింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!