SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయిల కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా రూ. 1.99 లక్షలు పోగొట్టుకున్న ఒక ఎస్బీఐ (SBI) ఖాతాదారుడికి వినియోగదారుల కోర్టులో న్యాయం జరిగింది. బెంగళూరుకు చెందిన ప్రదోష్ కుమార్ అనే వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవం, ఆ తర్వాత ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
2022 జూలైలో ప్రదోష్కు ఒక ఎస్సెమ్మెస్ (SMS) వచ్చింది. “మీ కరెంటు బిల్లు కట్టలేదు, వెంటనే కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం” అన్నది ఆ మెసేజ్లో ఉంది. భయపడిన ఆయన, ఆ మెసేజ్లో ఉన్న నంబర్కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లుగా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుని, కేవలం 20 రూపాయల బిల్లు కట్టడానికి ప్రయత్నించారు. అంతే.. వెంటనే ఆయన ఖాతా నుంచి మొదట రూ. 25,000, ఆ తర్వాత రూ. 1.99 లక్షలు కట్ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఎలాంటి ఓటీపీ (OTP) రాలేదు.
Also Read
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
ఖాతాదారుడి పోరాటం..
డబ్బులు పోయిన వెంటనే ప్రదోష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అదే రోజు ఎస్బీఐ హెల్ప్లైన్ , ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం అందించారు. బ్యాంకు స్పందించి మొదట కట్ అయిన రూ. 25,000 తిరిగి ఇచ్చింది కానీ.. పెద్ద మొత్తమైన రూ. 1.99 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఖాతాదారుడి తప్పిదం వల్లే డబ్బులు పోయాయని వాదించింది.
కోర్టు తీర్పు..
ఈ కేసు జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC) వద్దకు చేరింది. విచారణ జరిపిన కోర్టు బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. మోసం జరిగిన వెంటనే (మూడు రోజులలోపు) బ్యాంకుకు సమాచారం ఇస్తే.. ఆ నష్టానికి ఖాతాదారుడు బాధ్యుడు కాదని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. కేవలం ఒక యాప్ డౌన్లోడ్ చేసినంత మాత్రాన అది ఖాతాదారుడి నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది. బాధితుడికి పోయిన రూ. 1.99 లక్షలతో పాటు, అదనంగా రూ. 25,000 పరిహారం చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు ఈ డబ్బులు చెల్లించకపోతే.. 8 శాతం వడ్డీ కూడా కట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు, మోసం జరిగితే వెంటనే స్పందిస్తే న్యాయం జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?