Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ గా రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (IPO) కి వచ్చిన తరుణంలో మస్క్ సంపద ఊహించని స్థాయికి చేరింది. అయితే ఒక్కటంటే ఒక్క ట్రేడింగ్ రోజులోనే మస్క్ నికర విలువ ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.7 లక్షల కోట్లు) పెరిగింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే 14.71 శాతం ఎక్కువ.
ఎలాన్ మస్క్ ఈ ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటడానికి జూన్ 12న జరిగిన స్పేస్ఎక్స్ ఐపీఓ (IPO) వేదికైంది. రాకెట్లు, శాటిలైట్లు, ఏఐ (AI) సాంకేతికతలో దూసుకుపోతున్న స్పేస్ఎక్స్ కంపెనీ.. తన పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లను మార్కెట్ నుంచి సమీకరించింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మస్క్ ఆస్తి 780 బిలియన్ డాలర్లు. అప్పట్లోనే ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ధనవంతుడి ఆస్తి (300 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ మూడు రెట్లతో ముందున్నారు. శుక్రవారం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం స్పేస్ఎక్స్లోనే మస్క్ వాటా విలువ 866 బిలియన్ డాలర్లకు చేరింది. దీనికి టెస్లా, ఇతర ఆస్తులు తోడవడంతో ఆయన మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లను దాటి, ప్రస్తుతం 1.3 ట్రిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకే రోజులో ఇంతటి భారీ సంపదను ఆర్జించకపోవడంతో, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఎలాన్ మస్క్ పేరే మారుమోగిపోతోంది.
Also Read
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
ఇదే సమయంలో ఆదివారం ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న తన ‘స్పేస్ఎక్స్’ సంస్థ రాబోయే 2030 నాటికి ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించబోతోందని ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో వారాంతంలో వాల్ స్ట్రీట్ (Wall Street) స్టాక్ మార్కెట్ విశ్లేషకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ టార్గెట్ ఎంత భారీదో అర్థం కావాలంటే కంపెనీ ప్రస్తుత ఆదాయాన్ని చూడాల్సిందే. 2025 ఆర్థిక సంవత్సరంలో స్పేస్ఎక్స్ మొత్తం ఆదాయం కేవలం 18.7 బిలియన్ డాలర్లు మాత్రమే. పైగా ఈ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లాభాలను (Profits) కూడా నివేదించలేదు. ఇటువంటి తరుణంలో మస్క్ ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ టార్గెట్ను ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మస్క్ ప్రకటనతో మార్కెట్లో జోష్ కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు, పోర్ట్ఫోలియో మేనేజర్లు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!