Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ గా రికార్డు సృష్టించారు. స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ నాస్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (IPO) కి వచ్చిన తరుణంలో మస్క్ సంపద ఊహించని స్థాయికి చేరింది. అయితే ఒక్కటంటే ఒక్క ట్రేడింగ్ రోజులోనే మస్క్ నికర విలువ ఏకంగా 164.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.7 లక్షల కోట్లు) పెరిగింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే 14.71 శాతం ఎక్కువ.
ఎలాన్ మస్క్ ఈ ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటడానికి జూన్ 12న జరిగిన స్పేస్ఎక్స్ ఐపీఓ (IPO) వేదికైంది. రాకెట్లు, శాటిలైట్లు, ఏఐ (AI) సాంకేతికతలో దూసుకుపోతున్న స్పేస్ఎక్స్ కంపెనీ.. తన పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లను మార్కెట్ నుంచి సమీకరించింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మస్క్ ఆస్తి 780 బిలియన్ డాలర్లు. అప్పట్లోనే ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ధనవంతుడి ఆస్తి (300 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ మూడు రెట్లతో ముందున్నారు. శుక్రవారం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం స్పేస్ఎక్స్లోనే మస్క్ వాటా విలువ 866 బిలియన్ డాలర్లకు చేరింది. దీనికి టెస్లా, ఇతర ఆస్తులు తోడవడంతో ఆయన మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లను దాటి, ప్రస్తుతం 1.3 ట్రిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకే రోజులో ఇంతటి భారీ సంపదను ఆర్జించకపోవడంతో, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఎలాన్ మస్క్ పేరే మారుమోగిపోతోంది.
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
ఇదే సమయంలో ఆదివారం ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న తన ‘స్పేస్ఎక్స్’ సంస్థ రాబోయే 2030 నాటికి ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించబోతోందని ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటనతో వారాంతంలో వాల్ స్ట్రీట్ (Wall Street) స్టాక్ మార్కెట్ విశ్లేషకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ టార్గెట్ ఎంత భారీదో అర్థం కావాలంటే కంపెనీ ప్రస్తుత ఆదాయాన్ని చూడాల్సిందే. 2025 ఆర్థిక సంవత్సరంలో స్పేస్ఎక్స్ మొత్తం ఆదాయం కేవలం 18.7 బిలియన్ డాలర్లు మాత్రమే. పైగా ఈ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లాభాలను (Profits) కూడా నివేదించలేదు. ఇటువంటి తరుణంలో మస్క్ ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ టార్గెట్ను ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మస్క్ ప్రకటనతో మార్కెట్లో జోష్ కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు, పోర్ట్ఫోలియో మేనేజర్లు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!