Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- ముంబైలో వాటర్ సంక్షోభం
- కనిపించని రుతుపవనాల జాడ
- కార్లు కడిగితే జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజధాని ముంబైలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రుతుపవనాలు రాకపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కఠిన ఆంక్షలు విధించింది. తాగునీటిని వృథా చేసినా, దుర్వినియోగం చేసినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. జూన్ 16 నాటికి ముంబైకి నీటిని అందించే సరస్సుల్లో మొత్తం నీటి నిల్వలు కేవలం 10.35 శాతానికి మాత్రమే పడిపోయాయని బీఎంసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న 10 శాతం నీటి కోతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, క్రీడా క్లబ్లకు సరఫరా చేసే నీటిలో 20 శాతం కోత విధించింది.
కొత్త కనెక్షన్లకు బ్రేక్
ప్రస్తుతం కొత్త నిర్మాణ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కనెక్షన్లు మంజూరు చేయబోమని బీఎంసీ స్పష్టం చేసింది. నిర్మాణ స్థలాలకు ఇచ్చిన తాత్కాలిక నీటి కనెక్షన్లను కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక తాగునీటిని ఉపయోగించి కార్లు కడగడం, తోటలకు నీరు పెట్టడం, రోడ్లు శుభ్రం చేయడం వంటి కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ అవసరాల కోసం బోర్వెల్లు లేదా బావుల నీటిని వినియోగించాలని ప్రజలకు సూచించింది.
Also Read
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Indian Railways: రైలులోనే "శోభనం గది".. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
- El Nino: భారత్కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
నగరంలోని అన్ని స్విమ్మింగ్ పూల్లకు నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ తయారీ యూనిట్లకు నీటి సరఫరాను కూడా పరిమితం చేసింది. కార్మికుల తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని అందించనున్నారు. వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఆర్సీఎఫ్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఎంఐడీసీతో పాటు భారత నౌకాదళం వంటి భారీ సంస్థలు తమ కార్యకలాపాల కోసం తప్పనిసరిగా శుద్ధి చేసిన మురుగునీరు లేదా రీసైకిల్ చేసిన నీటినే ఉపయోగించాలని ఆదేశించింది.
ముంబై నగర తాగునీటి సరఫరా పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. అప్పర్ వైతర్ణా, మోడక్ సాగర్, తన్సా, మిడిల్ వైతర్ణా, భత్సా, విహార్, తులసి అనే ఏడు ప్రధాన జలాశయాల నుంచి నగరానికి నీరు సరఫరా అవుతోంది. అయితే ఈ ఏడాది ఆలస్యమైన రుతుపవనాల కారణంగా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో నీటి వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని బీఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముంబై సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, కార్ వాష్కు అనుమతి లేదు, నీటి దుర్వినియోగంపై జరిమానాముంబైకి నీటిని సరఫరా చేసే సరస్సులలో మొత్తం నీటి నిల్వలు జూన్ 16 నాటికి 10.35 శాతం అనే ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు బీఎంసీ మంగళవారం ఒక సర్క్యులర్లో తెలిపింది.
- Tags
- BMC
- mumbai
- water crisis
తాజావార్తలు
-
Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
-
Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
-
Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..