SBI: గుడ్న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వాటిపై వడ్డీ రేట్లు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.. రికరింగ్ డిపాజిట్లపై (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది… పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాఇ.. కనీసం రూ.100 డిపాజిట్ కోసం ఎస్బీఐలో ఆర్డీని తెరవవచ్చు. ఈ ఆర్డీ ఖాతాలను 12 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది.. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లాగానే, సీనియర్ సిటిజన్లకు అన్ని కాల వ్యవధిలో అదనపు వడ్డీని అందిస్తోంది ఎస్బీఐ. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 5.3 శాతం – 5.5 శాతం మధ్య మారుతూ ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది.
Read Also: Somu Veerraju: అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు..!
Also Read
- mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
ఒక ఏడాది నుండి రెండేళ్ల కంటే తక్కువ కాల వ్యవధిలో ఆర్డీపై వడ్డీ రేటు 5.3 శాతంగా ఉండగా.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధిలోని డిపాజిట్లపై వడ్డీ రేటును గతంలో 5.20 శాతం నుంచి 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.35 శాతం చేశారు.. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలవ్యవధిలోని డిపాట్లపై రేటు 5.45 శాతం, ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి, వడ్డీ రేటు 5.50 శాతంగా ఉంది.. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ తన డిపాజిట్ మరియు రుణ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధి కోసం రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం పెంచినట్లు ఎస్బీఐ తెలిపింది.
రిటైల్ దేశీయ టర్మ్ డిపాజిట్లపై (రూ.2 కోట్ల కంటే తక్కువ) సవరించిన వడ్డీ రేట్లు జూన్ 14, 2022 నుండి అమల్లోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వెబ్సైట్లో పేర్కొంది. 211 రోజుల నుండి 1 సంవత్సరంలోపు డిపాజిట్ల కోసం, రుణదాత 4.60 శాతం వడ్డీ రేటును అందిస్తారు, ఇది ముందు 4.40 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇంతకుముందు 4.90 శాతం ఉన్న వడ్డీ 5.10 శాతం అందించబడుతుంది. అదేవిధంగా, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు దేశీయ టర్మ్ డిపాజిట్ల కోసం, కస్టమర్లు 0.20 శాతం వరకు 5.30 శాతం వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు, వడ్డీ రేటు ఇదే మార్జిన్తో 5.80 శాతంగా ఉంటుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో ఎస్బీఐ వడ్డీ రేటును 5.20 శాతం నుండి 5.35 శాతానికి పెంచింది, అయితే సీనియర్ సిటిజన్లు 5.70 శాతం నుండి 5.85 శాతానికి పొందవచ్చు.
ఇక, రుణదాత ఎంపిక చేసిన టేనర్ల కోసం రూ.2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ దేశీయ బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.75 శాతం వరకు సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం రెపో రేటును 0.50 శాతం నుంచి 4.90 శాతానికి పెంచింది. రెపో అనేది బ్యాంకులకు ఆర్బీఐ విధించే స్వల్పకాలిక రుణ రేటు అనే విషయం తెలిసిందే. ఎస్బీఐ జూన్ 15, 2022 నుండి అమల్లోకి వచ్చే విధంగా ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) యొక్క మార్జినల్ కాస్ట్ ఆఫ్ 0.20 శాతం వరకు సవరించింది. ఎస్బీఐ తన వెబ్సైట్ ప్రకారం జూన్ 15, 2022 నుండి రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని కూడా పెంచింది. జూన్ 8న ఆర్బీఐ రెపో రేటు సవరణ తర్వాత పలు బ్యాంకులు రేట్లు పెంచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!