Somu Veerraju: అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో పారే నీటిలో తప్పనిసరిగా సిల్టు ఉంటుంది.. అది కాల్వల్లో పేరుకుపోతుంది.. గుర్రపుడెక్క వంటి కలుపును వెంట వెంటనే తీయకపోతే విపరీతంగా వృద్ధిచెంది నీటి ప్రవాహాలను అడ్డుకుంటుందన్నారు. ఇవన్నీ ఇరిగేషన్ అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకూ తెలుసు. కానీ, వాటికి నిధులు కేటాయించటం వృథా అనుకుంటున్నారు.. దానివల్ల ఓట్లు రావు.. పంచితే ఓట్లు వస్తాయన్న భావనతో పాలన సాగిస్తున్నారు.. అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
కనీసం వేసవిలో నరేగా నిధులతో ఈ పనులు చేసేలా ఉపాధి కూలీలను ప్రోత్సహించవచ్చు అని సలహా ఇచ్చారు సోము వీర్రాజు.. తూతూ మంత్రంగా పనులే చేసి ఆ నిధులు పంచుకోవాలి అని చూస్తున్నారు.. ఇంత దుర్మార్గం జరుగుతోంది కనుకనే రైతులు వరి వేయం అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి.. ప్రభుత్వం పెద్ద బాధ్యతగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు. ఉన్న నిధులనే పొదుపుగా, సక్రమంగా, అవినీతి రహితంగా వాడితే ఈ పనులన్నింటికీ నిధులు ఉంటాయి… అసలు ప్రభుత్వమే నిర్లక్ష్యంతో అసమర్ధతతో పూడిపోతే వీటిని పట్టించుకునేదెవరు? అని నిలదీశారు. రైతులతో కలసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని ప్రకటించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!