వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ… వివరాలు ఇవిగో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల డిపాజిట్లోనే రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) అకౌంట్ తెరిచే అవకాశం ఎస్బీఐలో ఉంది.. ఇక, 12 నెలల నుంచి పదేళ్ల సమయం వరకు ఎంత కాలానికైనా ఆర్డీ అకౌంట్ను తెరుచుకోవచ్చు.
Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు
Also Read
- Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
- Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
- Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ 'లాక్డౌన్' లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
రికరింగ్ డిపాజిట్ అనేది పొదుపు పథకం, దీనిలో పెట్టుబడిదారుడు వాయిదాలలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తాజా సవరణతో కాలపరిమితి బట్టి రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్ 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలలోపు మెచ్యూరింగ్ 5.1 శాతం వడ్డీ రేటు ఉండగా.. రికరింగ్ డిపాజిట్ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలలోపు మెచ్యూరిటీ 5.1 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.. ఇక, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ 5.3 శాతం వడ్డీ రేటు.. 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు 5.4 శాతం వడ్డీ రేటు అందించనున్నట్టు పేర్కొంది. ఎస్బీఐ కస్టమర్లు కనీసం రూ. 100 డిపాజిట్తో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు మరియు పెట్టుబడిని పెంచుకోవచ్చు.. ఒక వ్యక్తి రికరింగ్ డిపాజిట్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయవచ్చనే దానిపై పరిమితి లేదు. అయితే, ఇన్వెస్టర్ ఇన్స్టాల్మెంట్ను ఫిక్స్ చేస్తే, వ్యక్తి దానిని మళ్లీ మార్చడానికి అనుమతించబడడు.. మరింత పెట్టుబడి పెట్టడానికి మరొక ఆర్బీ ఖాతాను తెరవవలసి ఉంటుంది. పెట్టుబడిదారులు 12 నెలల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో మాదిరిగానే, సీనియర్ సిటిజన్లు తెరిచిన రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై ఎస్బీఐ అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.
తాజావార్తలు
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!