Rupee Strengthened: పడి పడి లేచె రూపాయి. ఒక్క రోజులో అత్యధిక విలువ పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి. చెప్పుకోదగ్గ విషయం కూడా. రూపాయి విలువతోపాటు బాండ్ ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆ ప్రభావం ఈ రెండింటిపై పడకపోవటం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి, కార్పొరేట్ల నుంచి డాలర్ ఇన్ఫ్లో పెరగటం కూడా రూపాయి విలువ బలపడటానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మర్ తెలిపారు.
డెయిరీ మార్కెట్.. డబుల్ ధమాకా..
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
మన దేశంలో డెయిరీ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 2 రెట్లకు పైగా వృద్ధి సాధించనుంది. తద్వారా 2027 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్కు చేరనుంది. ఈ విషయాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మీనేష్ షా వెల్లడించారు. మార్కెట్ సైజ్ పరంగానే కాకుండా వ్యాల్యూ పరంగా కూడా గ్రోత్ ఉంటుందని అంచనా వేశారు. విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 8 కోట్ల మంది పాడి పరిశ్రమ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
also read: Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్ ఫ్రం హోం?
రష్యా చూపు.. మన టూరిస్టుల వైపు..
ఇండియన్ టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను సమర్థంగా తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలోని రెండు టాప్ సిటీలైన మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ తమ ప్రతినిధులను ముంబైలో జరుగుతున్న ఓటీఎం ట్రేడ్ ఈవెంట్కి పంపింది. ఇదొక అతిపెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ కావటంతో ఇక్కడకి భారీగా వచ్చే ట్రావెల్ ఏజెంట్లకు తమ టూర్ ప్యాకేజ్ల గురించి వివరించొచ్చని ఆ దేశం భావించినట్లు చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Story Bord : పార్లమెంట్ మాన్సూన్ సెషన్ కీలకం కాబోతుందా..?
-
CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై చంద్రబాబు సమీక్ష
-
Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
-
Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
-
PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..