Rupee Strengthened: పడి పడి లేచె రూపాయి. ఒక్క రోజులో అత్యధిక విలువ పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి. చెప్పుకోదగ్గ విషయం కూడా. రూపాయి విలువతోపాటు బాండ్ ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆ ప్రభావం ఈ రెండింటిపై పడకపోవటం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి, కార్పొరేట్ల నుంచి డాలర్ ఇన్ఫ్లో పెరగటం కూడా రూపాయి విలువ బలపడటానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మర్ తెలిపారు.
డెయిరీ మార్కెట్.. డబుల్ ధమాకా..
Also Read
- Memory Chip: చిప్ తయారీలో భారత్ సంచలనం.. కొత్త పెట్టుబడుల రాకపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
- MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
- Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ... ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
మన దేశంలో డెయిరీ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 2 రెట్లకు పైగా వృద్ధి సాధించనుంది. తద్వారా 2027 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్కు చేరనుంది. ఈ విషయాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మీనేష్ షా వెల్లడించారు. మార్కెట్ సైజ్ పరంగానే కాకుండా వ్యాల్యూ పరంగా కూడా గ్రోత్ ఉంటుందని అంచనా వేశారు. విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 8 కోట్ల మంది పాడి పరిశ్రమ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
also read: Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్ ఫ్రం హోం?
రష్యా చూపు.. మన టూరిస్టుల వైపు..
ఇండియన్ టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను సమర్థంగా తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలోని రెండు టాప్ సిటీలైన మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ తమ ప్రతినిధులను ముంబైలో జరుగుతున్న ఓటీఎం ట్రేడ్ ఈవెంట్కి పంపింది. ఇదొక అతిపెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ కావటంతో ఇక్కడకి భారీగా వచ్చే ట్రావెల్ ఏజెంట్లకు తమ టూర్ ప్యాకేజ్ల గురించి వివరించొచ్చని ఆ దేశం భావించినట్లు చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
-
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Wonder: పొలంలో ఏడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఆవు.. అద్భుతమంటూ ఎగబడిన జనం..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?