Gold Loans: ఆర్బీఐ కొత్త రూల్స్.. గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు!
- ఆర్బీఐ కొత్త రూల్స్
- గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు
- గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది. గోల్డ్ కు ఉన్న వాల్యూ అలాంటిది. ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి. దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి. దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎన్ఎఫ్ బీసీలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్. బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ బంగారం వారిదేనా, కాదా అనేది నిర్ధారించుకోవాలి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. తీసుకున్న లోన్ ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు, ఎన్ఎఫ్ బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Also Read:PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ. బంగారం విలువను నిర్ధారించే దగ్గర్నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్దతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి. అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి.
Also Read:10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది. ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఎన్ ఎఫ్ బీసీలు ఒకే విధమైన విధివిధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నది ఆర్బీఐ. గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడితో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!