Gold Loans: ఆర్బీఐ కొత్త రూల్స్.. గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు!
- ఆర్బీఐ కొత్త రూల్స్
- గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు
- గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?
Also Read
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది. గోల్డ్ కు ఉన్న వాల్యూ అలాంటిది. ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి. దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి. దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎన్ఎఫ్ బీసీలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్. బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ బంగారం వారిదేనా, కాదా అనేది నిర్ధారించుకోవాలి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. తీసుకున్న లోన్ ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు, ఎన్ఎఫ్ బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Also Read:PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ. బంగారం విలువను నిర్ధారించే దగ్గర్నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్దతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి. అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి.
Also Read:10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది. ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఎన్ ఎఫ్ బీసీలు ఒకే విధమైన విధివిధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నది ఆర్బీఐ. గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడితో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!