Gold Loans: ఆర్బీఐ కొత్త రూల్స్.. గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు!
- ఆర్బీఐ కొత్త రూల్స్
- గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు
- గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము. అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరుగెత్తుతుంటారు. కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకివ్వబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోందని సమాచారం. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీకాదు అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం ఏంటి? కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?
Also Read
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
బంగారాన్ని తాకట్టు పెడితే క్షణాల్లో అప్పు పుడుతుంది. గోల్డ్ కు ఉన్న వాల్యూ అలాంటిది. ఇటీవలి కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి. దీంతోపాటు వివాదాలు కూడా పెరిగాయి. దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, ఎన్ఎఫ్ బీసీలకు ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్లు టాక్. బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలనే వారి నుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ బంగారం వారిదేనా, కాదా అనేది నిర్ధారించుకోవాలి. అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. తీసుకున్న లోన్ ను దేనికి ఉపయోగించారో బ్యాంకులు, ఎన్ఎఫ్ బీసీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Also Read:PM Modi: ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ. బంగారం విలువను నిర్ధారించే దగ్గర్నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో పద్దతిని అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి. అలాగే రుణం తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి.
Also Read:10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేయబోతోంది. ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, ఎన్ ఎఫ్ బీసీలు ఒకే విధమైన విధివిధానాలు పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నది ఆర్బీఐ. గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడితో పాటు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!