Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
READ ALSO: MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్సభలో ఎంపీ కావ్య డిమాండ్..
Also Read
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
- Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
డీజిల్పై లీటరుకు రూ.21.5, ఏటీఎఫ్పై లీటరుకు రూ.29.5 ఎగుమతి సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఇంధన రంగం నుంచి వచ్చే అదనపు లాభాలను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశ్యం. ఒకవైపు ఎగుమతులపై పన్నులు పెంచిన ప్రభుత్వం, దేశీయ వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3 తగ్గించగా, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది.
రిలయన్స్ ఎగుమతులపై ప్రభావం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఏటీఎఫ్, డీజిల్ ఎగుమతిదారు. జామ్నగర్లోని రిఫైనరీలు భారత మొత్తం ఏటీఎఫ్ ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఎగుమతులపై పన్ను పెరగడం వల్ల కంపెనీ లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించారు. కాగా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. రిలయన్స్ వంటి హెవీవెయిట్ స్టాక్ పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావంతో సూచీలు దాదాపు 2% మేర నష్టపోయాయి. గత నెల రోజుల్లో రిలయన్స్ స్టాక్ సుమారు 3% పతనమవ్వడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
READ ALSO: Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
తాజావార్తలు
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!