Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Industries: భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. డీజిల్, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును తిరిగి విధించడమే ఈ పతనానికి ప్రధాన కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రిలయన్స్ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.82,000 కోట్లు మేర పడిపోయింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, సరఫరాలో కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
READ ALSO: MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్సభలో ఎంపీ కావ్య డిమాండ్..
Also Read
- Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
డీజిల్పై లీటరుకు రూ.21.5, ఏటీఎఫ్పై లీటరుకు రూ.29.5 ఎగుమతి సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఇంధన రంగం నుంచి వచ్చే అదనపు లాభాలను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశ్యం. ఒకవైపు ఎగుమతులపై పన్నులు పెంచిన ప్రభుత్వం, దేశీయ వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.3 తగ్గించగా, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది.
రిలయన్స్ ఎగుమతులపై ప్రభావం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఏటీఎఫ్, డీజిల్ ఎగుమతిదారు. జామ్నగర్లోని రిఫైనరీలు భారత మొత్తం ఏటీఎఫ్ ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఎగుమతులపై పన్ను పెరగడం వల్ల కంపెనీ లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించారు. కాగా, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను రిలయన్స్ తీవ్రంగా ఖండించింది. రిలయన్స్ వంటి హెవీవెయిట్ స్టాక్ పడిపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రభావంతో సూచీలు దాదాపు 2% మేర నష్టపోయాయి. గత నెల రోజుల్లో రిలయన్స్ స్టాక్ సుమారు 3% పతనమవ్వడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.
READ ALSO: Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
తాజావార్తలు
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!