Prepaid Offer: రిలయన్స్ జియో నుంచి మరో బెస్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్
ప్రస్తుతం దేశంలోని పలు టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఎయిర్టెల్, జియో మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. జియో దెబ్బతో ఎయిర్టెల్ కూడా రీ ఛార్జ్ ప్లాన్లను తక్కువ ధరకే అందిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నెట్వర్క్ పరంగా ఏది బెస్ట్ అయితే కస్టమర్లు దానినే ఎంచుకుంటున్నారు. ఎయిర్టెల్ నుంచి పోటీ ఉండటంతో జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు మొబైల్ యూజర్లు 20 MB డేటా కోసం రీఛార్జ్ చేసుకోవడానికే అత్యధికంగా ఖర్చు చేసేవాళ్లు. కానీ నేడు చాలా తక్కువ ఖర్చుతో ప్రతిరోజూ 1 జీబీ కంటే ఎక్కువ డేటా వాడే పరిస్థితులు నెలకొన్నాయి.
సాధారణంగా టెలికాం కంపెనీలు ప్రస్తుతం అందిస్తున్న అనేక ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. నెల తిరగకముందే రెండు సార్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో జియో తాజాగా తన కస్టమర్ల కోసం 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.259 రీఛార్జ్ ప్లాన్తో వినియోగదారులు 30 రోజులు లేదా 31 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చని జియో తెలిపింది. ఈ ప్లాన్ను ఎంచుకున్న వినియోగదారులకు ప్రతిరోజూ 1.5GB డేటా లభిస్తుంది. ఈ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజూ ఉచితంగా 100 SMSలు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియో యాప్ల కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Also Read
- Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
- Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో