Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
- ఒక్కో షేరుపై రూ.100 లాభం!
- బుధవారం ఒక్కరోజే రూ.52,032 కోట్లు పెరిగిన కంపెనీ వ్యాల్యుయేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షించింది.
వరుసగా మూడవ రోజు లాభాలు
సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ రిలయన్స్ మాత్రం తన జోరును తగ్గించడం లేదు. బుధవారం మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేరు రూ.1,416 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఒక దశలో 2.77 శాతం పెరిగి 1,427.40 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. గత శుక్రవారం 1,327.65 రూపాయల వద్ద ఉన్న షేరు ధర, కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 రూపాయల (సుమారు 7.50 శాతం) మేర పెరిగింది. ఈ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. గత మూడు రోజుల్లోనే రిలయన్స్ మార్కెట్ విలువ సుమారు రూ.1.35 లక్షల కోట్లు పెరిగింది. గత వారం రూ.18 లక్షల కోట్ల లోపు ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, ఇప్పుడు ఏకంగా రూ.19.31 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇదే జోరు గనుక మరో రెండు రోజులు కొనసాగితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
పెరుగుదలకు కారణాలు ఇవే..
రిలయన్స్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలే ఈ లాభాలకు ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైల్, టెలికాం రంగాల్లో కంపెనీ చూపుతున్న స్థిరమైన వృద్ధి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. బుధవారం ఒక్కరోజే కంపెనీ వ్యాల్యుయేషన్ సుమారు రూ.52,032 కోట్లు పెరగడం గమనార్హం. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ రూ.20 లక్షల కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!