Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
- ఒక్కో షేరుపై రూ.100 లాభం!
- బుధవారం ఒక్కరోజే రూ.52,032 కోట్లు పెరిగిన కంపెనీ వ్యాల్యుయేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షించింది.
వరుసగా మూడవ రోజు లాభాలు
సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ రిలయన్స్ మాత్రం తన జోరును తగ్గించడం లేదు. బుధవారం మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేరు రూ.1,416 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఒక దశలో 2.77 శాతం పెరిగి 1,427.40 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. గత శుక్రవారం 1,327.65 రూపాయల వద్ద ఉన్న షేరు ధర, కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 రూపాయల (సుమారు 7.50 శాతం) మేర పెరిగింది. ఈ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. గత మూడు రోజుల్లోనే రిలయన్స్ మార్కెట్ విలువ సుమారు రూ.1.35 లక్షల కోట్లు పెరిగింది. గత వారం రూ.18 లక్షల కోట్ల లోపు ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, ఇప్పుడు ఏకంగా రూ.19.31 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇదే జోరు గనుక మరో రెండు రోజులు కొనసాగితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
పెరుగుదలకు కారణాలు ఇవే..
రిలయన్స్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలే ఈ లాభాలకు ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైల్, టెలికాం రంగాల్లో కంపెనీ చూపుతున్న స్థిరమైన వృద్ధి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. బుధవారం ఒక్కరోజే కంపెనీ వ్యాల్యుయేషన్ సుమారు రూ.52,032 కోట్లు పెరగడం గమనార్హం. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ రూ.20 లక్షల కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!