Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
- ఒక్కో షేరుపై రూ.100 లాభం!
- బుధవారం ఒక్కరోజే రూ.52,032 కోట్లు పెరిగిన కంపెనీ వ్యాల్యుయేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షించింది.
వరుసగా మూడవ రోజు లాభాలు
సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ రిలయన్స్ మాత్రం తన జోరును తగ్గించడం లేదు. బుధవారం మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేరు రూ.1,416 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఒక దశలో 2.77 శాతం పెరిగి 1,427.40 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. గత శుక్రవారం 1,327.65 రూపాయల వద్ద ఉన్న షేరు ధర, కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 రూపాయల (సుమారు 7.50 శాతం) మేర పెరిగింది. ఈ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. గత మూడు రోజుల్లోనే రిలయన్స్ మార్కెట్ విలువ సుమారు రూ.1.35 లక్షల కోట్లు పెరిగింది. గత వారం రూ.18 లక్షల కోట్ల లోపు ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, ఇప్పుడు ఏకంగా రూ.19.31 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇదే జోరు గనుక మరో రెండు రోజులు కొనసాగితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
పెరుగుదలకు కారణాలు ఇవే..
రిలయన్స్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలే ఈ లాభాలకు ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైల్, టెలికాం రంగాల్లో కంపెనీ చూపుతున్న స్థిరమైన వృద్ధి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. బుధవారం ఒక్కరోజే కంపెనీ వ్యాల్యుయేషన్ సుమారు రూ.52,032 కోట్లు పెరగడం గమనార్హం. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ రూ.20 లక్షల కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!