PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Yojana : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 23వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఈ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా విభజించి ఒక్కోసారి రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
ఇప్పటికే ఈ పథకం కింద 22 విడతలు విడుదలయ్యాయి. తాజాగా 22వ విడతను 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి విడత మధ్య సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే 23వ విడత విడుదలకు సంబంధించిన సమయం జూన్ నెలలో పూర్తవుతోంది.
అయితే గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే, నాలుగు నెలల గడువు పూర్తయిన వెంటనే నిధులు విడుదల కావడం తప్పనిసరి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 23వ విడత జూన్లో కాకుండా జూలై నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జూన్ నెలలోనే విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పథకానికి సంబంధించిన వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక తేదీ ప్రకటించబడలేదు.
ఇదిలా ఉంటే, పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు కొన్ని కీలక ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయడం, ఆధార్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం, భూ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలు అత్యంత కీలకం. ఈ ప్రక్రియల్లో ఏదైనా పెండింగ్లో ఉంటే రైతులు విడత మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
అందువల్ల 23వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ పథకం ఖాతా వివరాలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. దీంతో ఇప్పుడు రైతులందరి చూపు 23వ విడత విడుదల తేదీపైనే నిలిచింది.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!