Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Semiconductor: భారతదేశం పెట్టుబడుకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే పలు సెమికండక్టర్ దిగ్గజ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ రంగంలో చైనా, తైవాన్ నియంతృత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిప్ తయారీకి భారత్ గమ్యస్థానంగా మార్చాలని కేంద్ర భావిస్తోంది. ఇప్పటికే ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు యూకే కు చెందిన మరో కంపెనీ ఒడిశాలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మొదటి దశలో రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. SRAM & MRAM టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూకే అధారిత కంపెనీ. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి.
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
Read Also: Nadipelli Diwakar Rao : మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్ధిగా మళ్లీ దివాకర్ రావు.!
గంజాం జిల్లాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆ జిల్లా కలెక్టర్ దిబ్యా జ్యోతి పరిదా పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ను దాదాపుగా 800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒడిశాలోని పలు జిల్లాలను సందర్శించినప్పటికీ.. గోపాల్పూర్ ఓడరేవు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, ఎయిర్స్ట్రిప్ మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున గంజాం జిల్లాలోని ఛత్రపూర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్ళలో యూనిట్ని స్థాపించి 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి దాదాపు ₹ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి తదుపరి దశల్లో యూనిట్ను విస్తరించాలని కూడా యోచిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుత యుగంలో సెమికండక్టర్స్ చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సెమికండక్టర్లతో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ సెట్లు, ల్యాప్టాప్లు, ఎయిర్ కండిషనర్లు, కార్లకు చిప్ సెట్స్ అవసరం. ఏటా మన దేశం దాదాపు ₹ 3 లక్షల కోట్ల సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. కంపెనీలు భారత్ లో వెలిస్తే విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!