పెట్రో ధరలు తగ్గించడం కుదరదు..! స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ దాటేశాయి.. అసలే కరోనా కష్టాల్లో ఈ పెట్రోల్, డీజిల్ పై వరుసగా వడ్డింపులు ఏంటి? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, పెట్రో ధరలు మాత్రం ఇప్పుడు తగ్గడం సంగతి అటుంచితే.. వడ్డింపు కూడా తప్పదనే తరహాలో వ్యాఖ్యలుచేశారు.. కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు ఉపశమనం కల్పించలేమని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పడిపోయిందని.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయం తగ్గే సూచనలే కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంపై చేయాల్సిన ఖర్చు పెరిగిపోతోందని.. దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు పెరిగిపోయాయని.. ఓవైపు ఆదాయం తగ్గడం.. మరోవైపు ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో.. పెట్రో ధరలు తగ్గించడం ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. ఇక, భారత్లో పెట్రో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడమే కారణంగా తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్.
Also Read
- Warren Buffett: 'అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది'.. వారెన్ బఫెట్
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?