Microsoft: రేపటిలోగా అమెరికా వచ్చేయండి.. హెచ్-1బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్ ఆదేశాలు..
- హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు పెంచిన అమెరికా..
- డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం..
- విదేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటిలోగా అమెరికా రావాల్సిందే: మైక్రోసాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft: హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గత ఈ-మెయిల్ పంపించినట్లు రాయిటర్స్ కథనాలు ప్రచురించింది. అయితే, యూఎస్ లోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్త్ కోసం ఇక్కడే తమ పనిని కొనసాగించాలని ఆ సంస్థ సూచించినట్లు తెలుస్తుంది.
Read Also: Pawan Vs Bonda Uma: కూటమిలో పొల్యూషన్ బోర్డు తుఫాన్.. బోండా వర్సెస్ పవన్ మధ్య మాటల యుద్ధం..!
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ మేరకు సూచనలు జారీ చేసింది. దీంతో పాటు ప్రముఖ టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా హెచ్-1బీ వీసాలను ఉపయోగిస్తున్నాయి. కాగా, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది.. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉండేది.. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తుంటాయి. తాజాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలకు పెను భారంగా మారబోతుంది. ఇకపై యూఎస్ వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!