Microsoft: రేపటిలోగా అమెరికా వచ్చేయండి.. హెచ్-1బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్ ఆదేశాలు..
- హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు పెంచిన అమెరికా..
- డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం..
- విదేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటిలోగా అమెరికా రావాల్సిందే: మైక్రోసాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft: హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గత ఈ-మెయిల్ పంపించినట్లు రాయిటర్స్ కథనాలు ప్రచురించింది. అయితే, యూఎస్ లోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్త్ కోసం ఇక్కడే తమ పనిని కొనసాగించాలని ఆ సంస్థ సూచించినట్లు తెలుస్తుంది.
Read Also: Pawan Vs Bonda Uma: కూటమిలో పొల్యూషన్ బోర్డు తుఫాన్.. బోండా వర్సెస్ పవన్ మధ్య మాటల యుద్ధం..!
Also Read
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ మేరకు సూచనలు జారీ చేసింది. దీంతో పాటు ప్రముఖ టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా హెచ్-1బీ వీసాలను ఉపయోగిస్తున్నాయి. కాగా, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది.. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉండేది.. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తుంటాయి. తాజాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలకు పెను భారంగా మారబోతుంది. ఇకపై యూఎస్ వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!