దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లో వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల కంటే శక్తివంతమైన కారుగా మారుతీ సుజుకీ ఉండే అవకాశం ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
Read: Whatsapp: వాట్సాప్లో మరో ఫీచర్…ఫేస్బుక్ తరహాలో…
48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 400 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా 59 కెడబ్ల్యూ బ్యాటరీతో నడిచే కారును చార్జ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. గుజరాత్లోని డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్నది. వీటిని ఈ కారులో వినియోగిస్తున్నారు. ఇక ఈ కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.