March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?
- రేపటి నుంచి కొత్త రూల్స్
- LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు
నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభంకానున్నది. ప్రతి నెల మాదిరిగానే మార్చి నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావం చూపనున్నాయి. వచ్చే నెలలో LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్చి 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటే కొన్ని అంశాల్లో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం తప్పుతుంది.
Also Read:Sambhal Jama Masjid: రంజాన్కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
మార్చి నుంచి సెబీ కొత్త నియమం
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ అకౌంట్ల నామినేషన్ విధానాన్ని పునరుద్ధరించడానికి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 1, 2025 నుంచి సవరించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెట్టుబడిదారుడు అనారోగ్యానికి గురైనా లేదా మరణం సంభవించినప్పుడు ఆస్తి బదిలీలను సులభతరం చేయడానికి ఈ కొత్త మార్పులను తీసుకొచ్చింది.
పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు
మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాల కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు గరిష్టంగా 10 మంది వ్యక్తులను నామినేట్ చేయవచ్చు.
క్లెయిమ్ చేయని ఫండ్స్ ను నివారించడానికి సింగిల్ హోల్డర్ ఖాతాలకు నామినీని అందించడం తప్పనిసరి. పెట్టుబడిదారులు పాన్, ఆధార్ (చివరి నాలుగు అంకెలు) లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్తో సహా నామినీ సమాచారాన్ని అందించాలి.
ఉమ్మడి ఖాతాలలో, సర్వైవర్షిప్ నియమం ప్రకారం ఫండ్స్ జీవించి ఉన్న ఖాతాదారులకు బదిలీ చేయబడతాయి.
Also Read:IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల ప్రారంభంలో, చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ ధరలు పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
FD వడ్డీ రేట్లలో మార్పులు
మార్చి 1 నుంచి కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించవచ్చు. వడ్డీ రేట్లు పెరిగినా లేదా తగ్గినా పొదుపులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
బీమా ప్రీమియంల కోసం మారనున్న UPI చెల్లింపు నియమాలు
మార్చి 1, 2025 నుండి, UPI వినియోగదారులు Bima-ASBA సౌకర్యం ద్వారా బ్లాక్ చేయబడిన మొత్తాల ద్వారా బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. దీని ద్వారా, జీవిత, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపుల కోసం ముందుగానే డబ్బును బ్లాక్ చేసుకోగలుగుతారు. పాలసీదారు ఆమోదం పొందిన తర్వాత డబ్బు ఖాతా నుంచి కట్ అవుతుంది.
Also Read:Warangal Airport: మామూనూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పన్ను చెల్లింపుదారులకు పన్ను సర్దుబాట్లు, ఉపశమనం
మార్చి 1, 2025న పన్ను సంబంధిత మార్పులు జరుగుతాయి. పన్ను స్లాబ్లు, TDS పరిమితులు సవరించే అవకాశం ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో