March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?
- రేపటి నుంచి కొత్త రూల్స్
- LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభంకానున్నది. ప్రతి నెల మాదిరిగానే మార్చి నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావం చూపనున్నాయి. వచ్చే నెలలో LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్చి 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటే కొన్ని అంశాల్లో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం తప్పుతుంది.
Also Read:Sambhal Jama Masjid: రంజాన్కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
మార్చి నుంచి సెబీ కొత్త నియమం
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ అకౌంట్ల నామినేషన్ విధానాన్ని పునరుద్ధరించడానికి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 1, 2025 నుంచి సవరించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెట్టుబడిదారుడు అనారోగ్యానికి గురైనా లేదా మరణం సంభవించినప్పుడు ఆస్తి బదిలీలను సులభతరం చేయడానికి ఈ కొత్త మార్పులను తీసుకొచ్చింది.
పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు
మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాల కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు గరిష్టంగా 10 మంది వ్యక్తులను నామినేట్ చేయవచ్చు.
క్లెయిమ్ చేయని ఫండ్స్ ను నివారించడానికి సింగిల్ హోల్డర్ ఖాతాలకు నామినీని అందించడం తప్పనిసరి. పెట్టుబడిదారులు పాన్, ఆధార్ (చివరి నాలుగు అంకెలు) లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్తో సహా నామినీ సమాచారాన్ని అందించాలి.
ఉమ్మడి ఖాతాలలో, సర్వైవర్షిప్ నియమం ప్రకారం ఫండ్స్ జీవించి ఉన్న ఖాతాదారులకు బదిలీ చేయబడతాయి.
Also Read:IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల ప్రారంభంలో, చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ ధరలు పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
FD వడ్డీ రేట్లలో మార్పులు
మార్చి 1 నుంచి కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించవచ్చు. వడ్డీ రేట్లు పెరిగినా లేదా తగ్గినా పొదుపులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
బీమా ప్రీమియంల కోసం మారనున్న UPI చెల్లింపు నియమాలు
మార్చి 1, 2025 నుండి, UPI వినియోగదారులు Bima-ASBA సౌకర్యం ద్వారా బ్లాక్ చేయబడిన మొత్తాల ద్వారా బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. దీని ద్వారా, జీవిత, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపుల కోసం ముందుగానే డబ్బును బ్లాక్ చేసుకోగలుగుతారు. పాలసీదారు ఆమోదం పొందిన తర్వాత డబ్బు ఖాతా నుంచి కట్ అవుతుంది.
Also Read:Warangal Airport: మామూనూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పన్ను చెల్లింపుదారులకు పన్ను సర్దుబాట్లు, ఉపశమనం
మార్చి 1, 2025న పన్ను సంబంధిత మార్పులు జరుగుతాయి. పన్ను స్లాబ్లు, TDS పరిమితులు సవరించే అవకాశం ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..