March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?
- రేపటి నుంచి కొత్త రూల్స్
- LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభంకానున్నది. ప్రతి నెల మాదిరిగానే మార్చి నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావం చూపనున్నాయి. వచ్చే నెలలో LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్చి 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటే కొన్ని అంశాల్లో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం తప్పుతుంది.
Also Read:Sambhal Jama Masjid: రంజాన్కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
మార్చి నుంచి సెబీ కొత్త నియమం
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ అకౌంట్ల నామినేషన్ విధానాన్ని పునరుద్ధరించడానికి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 1, 2025 నుంచి సవరించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెట్టుబడిదారుడు అనారోగ్యానికి గురైనా లేదా మరణం సంభవించినప్పుడు ఆస్తి బదిలీలను సులభతరం చేయడానికి ఈ కొత్త మార్పులను తీసుకొచ్చింది.
పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు
మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాల కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు గరిష్టంగా 10 మంది వ్యక్తులను నామినేట్ చేయవచ్చు.
క్లెయిమ్ చేయని ఫండ్స్ ను నివారించడానికి సింగిల్ హోల్డర్ ఖాతాలకు నామినీని అందించడం తప్పనిసరి. పెట్టుబడిదారులు పాన్, ఆధార్ (చివరి నాలుగు అంకెలు) లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్తో సహా నామినీ సమాచారాన్ని అందించాలి.
ఉమ్మడి ఖాతాలలో, సర్వైవర్షిప్ నియమం ప్రకారం ఫండ్స్ జీవించి ఉన్న ఖాతాదారులకు బదిలీ చేయబడతాయి.
Also Read:IND vs NZ: ఇండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల ప్రారంభంలో, చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ ధరలు పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. లేదా స్థిరంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
FD వడ్డీ రేట్లలో మార్పులు
మార్చి 1 నుంచి కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించవచ్చు. వడ్డీ రేట్లు పెరిగినా లేదా తగ్గినా పొదుపులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
బీమా ప్రీమియంల కోసం మారనున్న UPI చెల్లింపు నియమాలు
మార్చి 1, 2025 నుండి, UPI వినియోగదారులు Bima-ASBA సౌకర్యం ద్వారా బ్లాక్ చేయబడిన మొత్తాల ద్వారా బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. దీని ద్వారా, జీవిత, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపుల కోసం ముందుగానే డబ్బును బ్లాక్ చేసుకోగలుగుతారు. పాలసీదారు ఆమోదం పొందిన తర్వాత డబ్బు ఖాతా నుంచి కట్ అవుతుంది.
Also Read:Warangal Airport: మామూనూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పన్ను చెల్లింపుదారులకు పన్ను సర్దుబాట్లు, ఉపశమనం
మార్చి 1, 2025న పన్ను సంబంధిత మార్పులు జరుగుతాయి. పన్ను స్లాబ్లు, TDS పరిమితులు సవరించే అవకాశం ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తుంది.
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!