Mahendra Nahata: రూ.10 పెడితే రూ.5,800 కోట్ల ప్రాఫిట్.. అంబానీ కంపెనీలో ఈ ఇన్వెస్టర్ కొట్టిన జాక్పాట్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahendra Nahata: స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్తో కూడిన వ్యాపారం అంటారు. కానీ, సరైన సమయంలో సరైన కంపెనీని గుర్తిస్తే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే.. ఈ కంపెనీ నమ్ముకున్న ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. టెలికాం రంగంలో సీనియర్ వ్యాపారవేత్త, హెచ్డీఎఫ్సీ ప్రమోటర్ అయిన మహేంద్ర నహతా ఒక రికార్డ్ సృష్టించారు. ఆయన జియోలో కేవలం రూ.10 ధరకే కొనుగోలు చేసిన ఒక షేరు విలువ.. ఇప్పుడు ఏకంగా 100 రెట్లకు పైగా పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
రూ.48 కోట్ల పెట్టుబడి.. రూ.5,800 కోట్లుగా
16 ఏళ్ల క్రితం రిలయన్స్ సంస్థ టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంలో మహేంద్ర నహతా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2020 జూలైలో జియో ప్లాట్ఫామ్స్ ప్రపంచ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిన సమయంలో.. నహతా కుటుంబానికి సుమారు రూ.37 కోట్ల ($4.4 మిలియన్లు) విలువైన కన్వర్టిబుల్ డిబెంచర్లను కేటాయించారు. ఆ తర్వాత రిలయన్స్ అదనపు షేర్లను కేటాయించడంతో కంపెనీలో వారి వాటా 0.54 శాతానికి (కచ్చితంగా చెప్పాలంటే 0.536%) చేరింది. ఇందుకోసం నహతా కుటుంబం మొత్తం రూ.48 కోట్లు పెట్టుబడి పెట్టింది. అప్పట్లో వారు ఒక్కో షేరును కేవలం రూ.10 ముఖ విలువతోనే సొంతం చేసుకున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘మోతీలాల్ ఓస్వాల్’ తాజా అంచనా ప్రకారం.. ప్రస్తుతం జియో ప్లాట్ఫామ్స్ మార్కెట్ విలువ సుమారు $114 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో లక్షల కోట్లు). ఈ లెక్కన మహేంద్ర నహతాకు ఉన్న 0.54 శాతం వాటా విలువ ఇప్పుడు ఏకంగా రూ.5,800 కోట్లకు చేరింది. అంటే పెట్టిన పెట్టుబడికి వంద రెట్లకు పైగా లాభం వచ్చి చేరింది. దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి భారీ లాభాలను తెచ్చిపెడుతుందనే దానికి ఇదే నిదర్శనం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
త్వరలోనే జియో ఐపీఓ
మరోవైపు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్ఫామ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటోంది. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఐపీఓపై కీలక అప్డేట్ ఇచ్చారు. “పాత, కొత్త పెట్టుబడిదారులందరికీ నేను హామీ ఇస్తున్నాను.. జియోకు అత్యంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్ నివేదికల ప్రకారం.. జియో ప్లాట్ఫామ్స్ ఈ ఐపీఓ ద్వారా ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువతో సుమారు 270 మిలియన్ల కొత్త షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తనకున్న వాటాను 66.43% నుంచి సుమారు 64.5%కి తగ్గించుకోనుంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన తుది పరిమాణం, ప్రైస్ బ్యాండ్ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఏదేమైనా ఐపీఓ కంటే ముందే జియో సృష్టించిన ఈ వెల్త్ క్రియేషన్ ఇప్పుడు దలాల్ స్ట్రీట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!