TCS: మళ్లీ “టాటా” టాప్.. భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్
- భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
- టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు
- భారత కరెన్సీలో రూ.4.17 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే? దేశంలోని అత్యంత విలువైన టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు.. రూ.4.17 లక్షల కోట్ల వరకు ఉంటుంది. వాస్తవానికి.. దేశంలోని టాప్-75 అత్యంత విలువైన బ్రాండ్ల విలువ 19 శాతం వృద్ధి చెందినట్లు కంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. వాటి మొత్తం విలువ 450.50 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.38 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. మార్కెటింగ్ డేటా, విశ్లేషణకు సంబంధించిన కంటార్ బ్రాండ్జ్ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వరుసగా మూడో సంవత్సరం అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచిందని నివేదిక వెల్లడించింది. దీని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్,ఎస్బీఐ ఉన్నాయి.
READ MORE: Delhi: కేంద్రానికి ఆప్ లేఖ.. కేజ్రీవాల్కు వసతి కల్పించాలని వినతి
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
కంటార్ బ్రాండ్జ్ నివేదిక ప్రకారం.. “టీసీఎస్ యొక్క బ్రాండ్ విలువ $49.7 బిలియన్లు. గతేడాది కంటే ఇది 16 శాతం పెరిగింది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ. రూ.4.17 లక్షల కోట్లు ఉంటుంది. బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణం ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పెట్టుబడి.” అని కంటార్ బ్రాండ్జ్ నివేదికలో పేర్కొంది.
READ MORE:Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం
54 బ్రాండ్లు గత ఏడాది కాలంలో తమ బ్రాండ్ విలువను సంవత్సరానికి పెంచుకున్నాయి. అన్ని వ్యాపార విభాగాల్లోని బ్రాండ్లు వృద్ధిని పెంచుతున్నాయి. ఈ జాబితాలో ఆర్థిక సేవలకు సంబంధించిన బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇందులో.. మొత్తం బ్రాండ్ విలువ ర్యాంకింగ్లో మొత్తం 17 బ్రాండ్లు 28 శాతం సహకారం అందించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ $38.3 బిలియన్ల విలువతో రెండవ స్థానంలో ఉండగా.. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $18 బిలియన్ల విలువతో ఐదవ స్థానంలో ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ $15.6 బిలియన్ల విలువతో ఆరో స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ $11.5 బిలియన్ల విలువతో 10వ స్థానంలో ఉంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ప్లాట్ఫారమ్ అయిన జొమాటో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించింది. దీని బ్రాండ్ విలువ $3.5 బిలియన్లకు రెండింతలు పెరిగి 31వ స్థానంలో ఉంది. ఫాస్ట్ డెలివరీ వ్యాపారంలో ఆవిష్కరణ, విస్తరణపై దాని ప్రాధాన్యత కారణంగా దాని బ్రాండ్ విలువ పెరిగింది. వాహన రంగంలో మారుతీ సుజుకీ ఆధిపత్యం చెలాయిస్తూ 17వ స్థానంలో ఉంది. ఆ తర్వాత బజాజ్ ఆటో 20వ స్థానంలో నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ వాల్యుయేషన్ 78 శాతం పెరిగి 30వ స్థానాకి చేరుకుంది. ఈ సంవత్సరం ర్యాంకింగ్ 108 కేటగిరీలలో 1,535 బ్రాండ్లపై 1.41 లక్షల మంది పాల్గొనేవారి అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!