Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్లో భారతీయుల ఆస్తులు
- విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల యత్నం
- ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్
- దాయపు పన్ను శాఖ విచారణలో బయటపడ్డ విషయం
- 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత ఆదాయపు పన్ను శాఖకు ఎటువంటి సమాచారం లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆస్తులను తప్పుదోవ పట్టించే ఆస్తులుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
ఢిల్లీలో లెక్కలు చూపని రూ.700 కోట్ల లావాదేవీలు..
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక్క ఢిల్లీ నుంచే రూ.700 కోట్లకు పైగా లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకారం.. డిపార్ట్మెంట్ యొక్క ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డజనుకు పైగా సోదాలు నిర్వహించింది. ఇందులో
ఒక్క ఢిల్లీలోనే రూ.700 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. విచారణ భారతదేశం అంతటా ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
జర్మనీ సమాచారాన్ని అందజేసింది..
ఇటీవల జర్మనీ మధ్యప్రాచ్యంలో భారతీయులకు చెందిన ఆస్తుల గురించి సమాచారాన్ని భారత్తో పంచుకుంది. వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అలాంటి సమాచారం జర్మనీ అధికారుల చేతికి ఎలా వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రూ.125 కోట్లకు పైగా నగదు పెట్టుబడి..
ఢిల్లీలో జరిగిన దాడుల్లో పన్ను చెల్లింపుదారులు రూ.125 కోట్లకు పైగా అప్రకటిత నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అధికారి తెలిపారు. ఈ దాడిలో నకిలీ నగదు చెల్లింపులు, రశీదులు, నకిలీ కొనుగోలు రశీదులు గుర్తించినట్లు ప్రజలు వెల్లడించారు. అక్టోబర్ చివరి నుంచి ప్రభుత్వం పంచుకున్న ఈ సమాచారం ఆధారంగా అనేక నోటీసులు జారీ చేయబడ్డాయి.
దోచుకున్న డబ్బే?
చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బును అక్రమంగా దుబాయ్కి తరలిస్తున్నట్లు ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏళ్లుగా అధికారంలో ఉంటూ.. అక్రమంగా సంపాధించిన డబ్బుతో అక్కడ భవనాలు, హోటళ్లు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాత వీటిపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి.!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!