Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
Infosys: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘వర్క్ ఫ్రం హోం’ పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది. ఇక తన ఉద్యోగులు కంపెనీలకు రావాలని పలు ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి వారిపై చర్యలకు కూడా సిద్ధం అవుతామని ఐటీ కంపెనీలు హెచ్చిస్తున్నాయి.
గూగుల్ తో సహా అనేక టెక్ కంపెనీలు WFH విధానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కఠినంగా ఆదేశించింది. ఇన్ఫోసిస్ అమెరికా, కెనడాల్లోని తన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించింది. రిమోట్ గా పనిచేయాలంటే తప్పని సరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఉద్యోగులకు తెలియజేసింది. వారానికి ఐదు రోజలు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఎవరైనా కొత్త వర్క్ పాలసీని పాటించడంతో విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ కు యూఎస్, కెనడాల్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
Read Also: Oracle: కొనసాగుతున్న లేఆఫ్స్.. ఒరాకిల్లో మరో విడత ఉద్యోగుల తొలగింపు
అయితే ఈ వర్క్ పాలసీ ప్రస్తుతానికైతే భారతదేశానికి వర్తింప చేయలేదు. అయితే గతేడాది ఉద్యోగులు క్రమంగా ఆఫీసులకు రావడానికి మూడు దశల ప్రణాలిక ప్రవేశపెట్టింది. మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి రెండు రోజలు కార్యాలయాలకు రావాలి. రెండవదశలో ఉద్యోగులు వేరే బ్రాంచ్ కు మార్చడం లేదా ట్రాన్స్ఫర్స్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది. మూడో దశలో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైబ్రీడ్ మోడ్ ప్రకారం ఉద్యోగులు ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలి.
ఫిబ్రవరి నెలలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యువకులు కూడా ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబట్టకూడదని.. నైతికత, సోమరితనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మూన్ లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్, వారానికి మూడు రోజులే వస్తానని కోరవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!