Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘వర్క్ ఫ్రం హోం’ పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది. ఇక తన ఉద్యోగులు కంపెనీలకు రావాలని పలు ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి వారిపై చర్యలకు కూడా సిద్ధం అవుతామని ఐటీ కంపెనీలు హెచ్చిస్తున్నాయి.
గూగుల్ తో సహా అనేక టెక్ కంపెనీలు WFH విధానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కఠినంగా ఆదేశించింది. ఇన్ఫోసిస్ అమెరికా, కెనడాల్లోని తన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించింది. రిమోట్ గా పనిచేయాలంటే తప్పని సరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఉద్యోగులకు తెలియజేసింది. వారానికి ఐదు రోజలు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఎవరైనా కొత్త వర్క్ పాలసీని పాటించడంతో విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ కు యూఎస్, కెనడాల్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
Read Also: Oracle: కొనసాగుతున్న లేఆఫ్స్.. ఒరాకిల్లో మరో విడత ఉద్యోగుల తొలగింపు
అయితే ఈ వర్క్ పాలసీ ప్రస్తుతానికైతే భారతదేశానికి వర్తింప చేయలేదు. అయితే గతేడాది ఉద్యోగులు క్రమంగా ఆఫీసులకు రావడానికి మూడు దశల ప్రణాలిక ప్రవేశపెట్టింది. మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి రెండు రోజలు కార్యాలయాలకు రావాలి. రెండవదశలో ఉద్యోగులు వేరే బ్రాంచ్ కు మార్చడం లేదా ట్రాన్స్ఫర్స్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది. మూడో దశలో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైబ్రీడ్ మోడ్ ప్రకారం ఉద్యోగులు ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలి.
ఫిబ్రవరి నెలలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యువకులు కూడా ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబట్టకూడదని.. నైతికత, సోమరితనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మూన్ లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్, వారానికి మూడు రోజులే వస్తానని కోరవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!