Indian Rupee: ఆల్టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93 మార్కును దాటి సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Iran Vs Israel War: ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు..! ఇరాన్ గెలవబోతుందా?
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
రికార్డు కనిష్ట స్థాయిలు ఇలా..
బుధవారం రూపాయి 92.89 వద్ద ముగియగా, గురువారం గుడి పడ్వా సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ప్రారంభం కాగానే రూపాయి 19 పైసలు క్షీణించి 93.08 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మరింత పతనం కాకుండా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) డాలర్లను విక్రయిస్తూ రంగంలోకి దిగినప్పటికీ, ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే డాలర్ బలాన్ని తెలిపే ‘డాలర్ ఇండెక్స్’ 0.17 శాతం పెరిగి 100.25 వద్దకు చేరింది.
రూపాయి విలువ ఎందుకు తగ్గుతుందంటే..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $107 వద్ద కొనసాగుతున్నాయి. ఇది భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల కరెన్సీపై భారాన్ని పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి నెలలో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. జనవరి 2025 తర్వాత ఇదే అతిపెద్ద ఉపసంహరణ కావడం గమనార్హం.
సామాన్యుడిపై ప్రభావం ఎంత?
రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ‘దిగుమతి ద్రవ్యోల్బణం’ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారి, ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, విదేశీ పర్యటనలకు వెళ్లే వారి ఖర్చులు భారీగా పెరుగుతాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వంటి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.
స్టాక్ మార్కెట్ ఆశలు..
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 960 పాయింట్లు పెరిగి 75,167 వద్ద, నిఫ్టీ 311 పాయింట్ల లాభంతో 23,313 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు లాభాల్లో ఉండటం రూపాయి మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలిగిందని అంటున్నారు. భవిష్యత్తులో చమురు సరఫరా మెరుగుపడితే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
READ ALSO: Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్.. పార్ట్ 3 ఉంటుందా?
తాజావార్తలు
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!