Tax Refund: ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..
- ఆదాయ పన్ను కట్టే వారికి బిగ్ షాక్..
- ఆధార్, పాన్ లింక్ చేయని వారికి రీఫండ్ నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 1.3 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయల రీఫండ్ డబ్బులు ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వారి పాన్ కార్డ్ ఇంకా ఆధార్తో లింక్ కాకపోవడమే.
చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయని వారి పాన్ కార్డ్ ‘ఇన్-ఆపరేటివ్’లోకి వెళ్లిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినా, మీకు రావాల్సిన రీఫండ్ డబ్బులను ప్రభుత్వం మీ ఖాతాలో వేయదు. ఆ డబ్బులను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటుంది. మీరు మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసిన తర్వాతే ఆ డబ్బులు మీకు అందుతాయి.
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
Also Read:Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ఈ వివరాలను తెలియజేశారు. జనవరి 1, 2026 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 9.25 కోట్ల మందికి పైగా ప్రజల పాన్ కార్డ్లు ఆధార్తో లింక్ అవ్వక పనిచేయడం లేదు. అంతేకాదు.. ఆలస్యంగా లింక్ చేసినందుకు గానూ ప్రభుత్వం జరిమానాల రూపంలోనే రూ.2,338 కోట్లకు పైగా వసూలు చేసింది.
పాన్ కార్డ్ పని చేయకపోతే, మీ ఆదాయంపై టీడీఎస్ (TDS) సాధారణం కంటే ఎక్కువగా (దాదాపు 20%) కోత విధిస్తారు. పాన్ కార్డ్ యాక్టివ్గా లేకపోతే పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం లేదా విత్ డ్రా చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఆధార్-పాన్ లింక్ చేయడానికి రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రీఫండ్ పొందడం ఎలా..?
మీ రీఫండ్ ఆగిపోయి ఉంటే కంగారు పడనక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా వెంటనే ఇన్కమ్ టాక్స్ పోర్టల్లోకి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లించి ఆధార్ను లింక్ చేయడమే. మీరు లింక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది.. అప్పుడు నిలిచిపోయిన మీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాకు చేరతాయి.
కాబట్టి.. మీ పాన్ కార్డ్ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకొని.. లింక్ అవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. దీనివల్ల అనవసరమైన జరిమానాలు, డబ్బులు ఆగిపోవడం వంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?