Home Loan: వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. హోంలోన్లపై భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక, ఆర్బీఐ చర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే తమ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంసీఎల్ఆర్తోపాటు వడ్డీరేట్లు పెంచేశాయి పలు బ్యాంకులు..
Read Also: Cyclone Asani: ‘అసని’ తీవ్ర తుఫాన్.. అప్రమత్తమైన నావికాదళం
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పీఎన్బీ, ఎస్బీఐ ఇలా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి.. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే, ఐ-ఈబీఎల్ఆర్ను 8.10 శాతంగా ఖరారు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 5వ తేదీన రిటైల్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా రెపోరేట్ అనుబంధ రుణ వడ్డీరేటు 6.90 శాతానికి పెంచేసింది. మరోవైపు, కెనరా బ్యాంకు అన్ని రకాల రిటైల్ రుణాలపై రెపోరేట్ అనుసంధాన రుణ రేటు 7.30 శాతానికి పెంచేసింది. ఇది మే 7 నుంచి అమలు చేస్తోంది. ఇక, మే ఒకటో తేదీ నుంచే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిటైల్ లెండింగ్ స్కీమ్స్పై వడ్డీరేటు 6.80 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపోరేట్ అనుబంధ ఆర్బీఎల్ఆర్ ఈ నెల 4వ తేదీ నుంచి 7.25 శాతానికి సవరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో దానిని 6.90 శాతానికి పెంచింది. ఇది ప్రస్తుత రుణ గ్రహీతలకు వచ్చే ఒకటో తేదీ నుంచి, నూతన కస్టమర్లకు ఈ నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది పీఎన్బీ.. మరోవైపు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అన్ని టెన్యూర్ల రుణ గ్రహీతలపై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు పెంచేశాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఎంసీఎల్ఆర్ 7.15 శాతం అమల్లోకి తెచ్చింది. ఇంతకుముందు ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉండేది. ఏడాది గడువుగల రునాలపై ఎంసీఎల్ఆర్ 7.50 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై 7.60 శాతం, మూడేండ్ల గడువు గల రుణాలపై 7.70 శాతం ఖరారు చేసింది. మరోవైపు, ఎస్బీఐ ఇటీవలే తన రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచింది. ఇది ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నెల ఒకటో తేదీ నుంచి తన ఎంసీఎల్ఆర్ను 6.60-7.70 శాతం మధ్య సవరించగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.60-7.55 శాతం మధ్య వడ్డించింది. ఈనెల రెండో తేదీ నుంచి యెస్ బ్యాంక్ అన్ని రుణాలపై ఎంసీఎల్ఆర్ 10-15 బేసిక్ పాయింట్లు పెంచారు. దీని ప్రకారం యెస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 6.85 – 8.60 శాతం మధ్య పెరిగింది. ఇక, యాక్సిస్ బ్యాంక్ గత నెల 18న ఎంసీఎల్ఆర్ 5 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.15-7.30 శాతం మధ్య ఖరారైంది. మొత్తంగా.. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో.. గృహరుణాలు, ఇతర రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!